
మిరాజ్: ‘మ్యూజికల్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందిన ఈ నగరం ప్రత్యేకత ఏంటంటే...

మహారాష్ట్రలో మిరాజ్ అనేది ఒక చిన్న నగరం. 150 ఏళ్లుగా శాస్త్రీయ సంగీతానికి నగరం ప్రసిద్ధ కేంద్రంగా ఉంది.
ముంబై నగరానికి 400 కి.మీ దూరంలో ఉన్న మిరాజ్ నగరం ఒకప్పటి పట్వర్ధన్ సంస్థానంలో భాగం. అనేక మంది ప్రముఖ శాస్త్రీయ సంగీతకారులకు ఇది నిలయం.
దేశంలో తీగ వాయిద్యాల హబ్గా పేరు పొందింది.
మిరాజ్లో తయారైన వేలాది సంగీత పరికరాలను ముఖ్యంగా తంబురా, సితార్, సారంగి, వీణ వంటి వాటిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు.
దేశంలోని చాలామంది అగ్రశ్రేణి సంగీతకారులు ఈ చారిత్రక నగరంలోని దిగ్గజ కళాకారులు ప్రత్యేకంగా రూపొందించిన సంగీత వాయిద్యాలను తెప్పించుకుంటారు.
- బీటీఎస్కు బ్రేక్ - ఇక సోలో ప్రాజెక్టులే, బ్యాండ్కు విరామం
- Ramsay Hunt syndrome: జస్టిన్ బీబర్ను బాధపెడుతున్న ఈ వ్యాధి ఎలాంటిది?


సంగీత వాద్యాల తయారీ పరిశ్రమను షికల్గర్ కమ్యూనిటీకి చెందిన 50 కుటుంబాల్లోని 300 మంది కళాకారులు నడుపుతున్నారు. ఏడు తరాలుగా వారు ఇదే పని చేస్తున్నారు.
18వ శతాబ్దం నుంచి ఈ వాయిద్యాలను తయారు చేస్తున్నారు.
చారిత్రకంగా షికల్గర్లు అనేవారు మరాఠా సామ్రాజ్యం పాలన సమయంలో కత్తులు, ఇతర మిలిటరీ పరికరాల తయారీలో ఆరితేరిన లోహకళాకారులు.
''కానీ 1818లో మరాఠా సామ్రాజ్యం పతనం, ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆధునిక ఆయుధాలు వాడటంతో మార్కెట్ క్షీణించింది. దాంతో షికల్గర్ కళాకారులు తమ సంప్రదాయ పనికి దూరం కావడం మొదలైంది’’ అని నగరంలోని చరిత్రకారుడు మాన్సింగ్ కుమ్తేకర్ చెప్పారు.
- సింగర్ కేకే: ప్రదర్శన తరువాత కుప్పకూలిన గాయకుడు
- సిద్ధూ మూసేవాలా హత్య: పంజాబీ సింగర్, కాంగ్రెస్ నాయకుడిపై కాల్పులు, హత్య... కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఏమన్నారంటే..


మిరాజ్ నగర సాంస్కృతిక చరిత్ర తర్వాతి కాలంలో మరింత మార్పుకు గురైంది.
మిరాజ్ రాజు శ్రీమంత్ బాలాసాహెబ్ పట్వర్ధన్ 2. ఆయన గొప్ప సంగీత ప్రేమికుడు. తన పాలనా కాలంలో ప్రదర్శనలు ఇవ్వడం కోసం ఉపఖండ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సంగీతకారులను మిరాజ్ నగరానికి ఆహ్వానించారు.
సంగీతకారులు తమ వెంట తెచ్చిన సంగీత పరికరాలకు మరమ్మతులు చేయడానికి ఆ కాలంలో ఎవరూ ఉండేవారు కాదని కమ్తేకర్ చెప్పారు.
దీంతో రాజు సహాయం కోసం షికల్గర్ కమ్యూనిటీ ప్రజలను ఆశ్రయించేవారని తెలిపారు.
- 'సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని
- తాన్సేన్ సమాధి మీద మొలిచిన బెర్రీ చెట్టు ఆకులు తింటే గొంతు మధురంగా మారుతుందా?


''సంగీత వాద్యాలకు మరమ్మతులు చేయడంలో సహాయపడగలరా? అని రాజు ఇద్దరు సోదరులైన ఫరీద్సాహెబ్, మోయిద్దీన్లను అడిగారు.
సంగీత ప్రేమికులైన ఆ సోదరులు ఇద్దరూ సంగీత వాయిద్యాల మరమ్మతులు, తయారీని బాగా నేర్చుకున్నారు. వారిని అందరూ 'సితార్ తయారీ నిపుణులు’ అని పిలవడం మొదలుపెట్టారు’’ అని కుమ్తేకర్ వివరించారు.
త్వరలోనే షికల్గర్ కమ్యూనిటీకి చెందిన ఇతర కుటుంబాలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. అలా అక్కడ ఈ పరిశ్రమ పురుడు పోసుకుంది.
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర సమస్య ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- 'సంగీత దర్శకులు, నిర్మాతలు ఈమె పాదాల మీద పడి, మాకు పాడండి అని ప్రాధేయపడే రోజులు..’


కానీ శతాబ్ద కాలపు మిరాజ్ సంగీత సంప్రదాయం ఇప్పుడు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమలో ఇప్పుడు కొన్ని వందల మంది మాత్రమే మిగిలిపోయారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు, మ్యూజిక్ యాప్ల రాక వల్ల ఈ క్రాఫ్ట్ను సంరక్షించడం సవాలుగా మారిందని కళాకారులు అంటున్నారు. తమ జీవనోపాధిని కోల్పోయేలా చేసిందని ఆవేదన చెందుతున్నారు.
వీరిలో కొంతమంది నూతన టెక్నాలజీకి మారారు. మిగతావారు సంప్రదాయ వృత్తిని కాపాడుకోవాలనే పట్టుదలతో ఇందులోనే కొనసాగుతున్నారు.
తమ భవిష్యత్ గురించి ఆందోళనగా ఉందని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సూర్యకుమార్ యాదవ్ 'వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
- హైదరాబాద్లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
- పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో..
- 'మనుషులు చంద్రుడి మీద జీవిస్తారు.. మరో 10 సంవత్సరాల్లోనే ఇది
- జ్ఞాపకశక్తి: ఏం తింటే పెరుగుతుంది, ఎలాంటి ఆహారాలతో దెబ్బతింటుంది?సాధ్యమవుతుంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)