అబ్బే.. మాకు తెలియదు, అసోం సీఎం కేసుపై మిజోరం సీఎస్.. రీ లూక్ అంటూ..
అసోం, మిజోరం ఘర్షణ పీక్కి చేరిన సంగతి తెలిసిందే. సరిహద్దుపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు రీ లూక్ చేస్తామని చెప్పింది. దీంతో ఇరు ప్రభుత్వాలు కాస్త మెత్తబడ్డాయని అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల్లో నెలకొన్న హై టెన్షన్ నేపథ్యంలో కూల్ కావడం కాస్త మంచి పరిణామమే అని చెప్పాల్సి ఉంటుంది.
అసోం సీఎం శర్మపై కేసుకు సంబంధించి పున:పరిశీలిస్తామని మిజోరం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో తెలిపారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో సీఎం శర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి తనకు గానీ, సీఎం జోరంతంగాకు కూడా తెలియదని వివరించారు. ఆ అంశాన్ని పరిశీలించామని సీఎం తనకు చెప్పారని.. అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు.

అసోం మిజోరం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి మిజోరం ప్రభుత్వం అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది. గతనెల 26వ తేదీ నుంచి ఘర్షణపూరిత వాతావరణం ఉండగా.. 30వ తేదీన కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి మిజోరం ఐజీ జాన్ వివరాలు కూడా వెల్లదీశారు. కానీ ఇప్పుడు సీఎస్ ఇలా కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసుకు సంబంధించి శర్మ కూడా స్పందించారు. పోలీసులు కాక.. తటస్థ ఏజెన్సీలకు ఎందుకు బాధ్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.
అసోం, మిజోరం ఘర్షణలో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఎస్పీ సహా 50 మంది గాయపడ్డారు. ఘర్షణకు అసోం పోలీసులే కారణం అని మిజోరం చెబుతోంది. గతనెల 26వ తేదీన జరిగిన ఘర్షణలో మిజోరంకు చెందిన ఇద్దర కూడా చనిపోయారని ఆ రాష్ట్రం చెబుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications