ఏంటి ఆ రాష్ట్ర రాజధానికి ఒక్క రైలు కూడా రాదా..!
ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని చూట్టు కావాల్సిన మౌలిక వసతులు ఉంటాయి. అలాగే ప్రజల ప్రయాణాలకు సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఓ రాష్ట్ర రాజధానికి ఇప్పటి వరకు రైలు మార్గం లేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు..మిజోరాం. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు ఇప్పటి వరకు రైలు మార్గం లేదు. 26 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఎట్టకేలకు భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది.
ఇది కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు, ఈశాన్య భారతదేశ అభివృద్ధికి, కనెక్టివిటీకి ఒక నూతన ఆధ్యాయాన్ని లిఖించిన చారిత్రాత్మక ఘట్టం. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్, 51.38 కిలోమీటర్ల విస్తృత గేజ్ ట్రాక్తో, ఐజ్వాల్ను భారత జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించింది.

జూన్ 2025లో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్, అస్సాం సరిహద్దులోని బైరాబి నుండి ఐజ్వాల్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైరాంగ్ వరకు విస్తరించి ఉంది. ఈ మార్గం నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. 48 సొరంగాలు, 142 వంతెనలు, కుతుబ్ మినార్ కంటే ఎత్తైన 104 మీటర్ల వంతెనతో కూడిన ఈ లైన్, మిజోరాం యొక్క కష్టమైన కొండ ప్రాంతాన్ని అధిగమించి నిర్మించబడింది.
ఈ రైల్వే లైన్ ఐజ్వాల్ను గౌహతి, అగర్తల, ఇటానగర్ తర్వాత రైలు సౌకర్యం కలిగిన నాలుగవ ఈశాన్య రాజధానిగా నిలిపింది. 2008-09లో ఆమోదించబడిన ఈ జాతీయ ప్రాజెక్ట్, కొండచరియలు, రుతుపవనాల వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఈ లైన్ అస్సాంకు ప్రయాణ సమయాన్ని మూడు నుంచి నాలుగు గంటలు తగ్గించడమే కాకుండా, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో వ్యూహాత్మక లాజిస్టిక్స్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ రైలు మార్గం మిజోరాం ప్రజల ఆర్థిక వృద్ధికి, పర్యాటక రంగానికి, సమగ్ర అభివృద్ధికి సరికొత్త మార్గాలను తెరిచింది.












Click it and Unblock the Notifications