హర్యానాలో ప్రధాని మోదీ నోట "ఖార్చీ-పార్చీ" మాట- దీని అర్థం ఏంటి..?
Haryana Assembly election 2024:హర్యానాలోని సోనిపట్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగ విధానాలను విమర్శించారు.ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతి వ్వవస్థను ప్రధాని మోదీ ఎత్తి చూపారు. ఈ పద్ధతిని "పార్చీ" "ఖార్చీ" అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అటువంటి అవినీతి పద్ధతులు లేకుండా 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించిందని, పారదర్శకతకు తమ పార్టీ నిబద్ధతను మోదీ నొక్కి చెప్పారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు ఉద్యోగాలు ఉపాధి అస్త్రాలు వదులుతున్నాయి. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిరుద్యోగం అంశాన్ని ఆయుధంగా వాడుతున్నాయి.ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకతతో ఉద్యోగ నియామకాలను చేపడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అవినీతి మరియు పక్షపాతం లేని రెండు లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో వెల్లడించింది.మరోవైపు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, BSP సహకారంతో అధికారంలోకి వస్తే తొలి ఏడాది నెలవారీ నిరుద్యోగ భృతితో పాటు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం హర్యానాలో నిరుద్యోగ సమస్యపై అన్ని పార్టీలు గళమెత్తుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నాయకులు లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇది ఒక్క కాంగ్రెస్ పాలనలోనే కాదని ఇతర ప్రభుత్వాలు ఉన్న సమయంలో కూడా జరిగాయని బీజేపీలోని కొందరు వ్యక్తులే గుసగుసలాడుతున్నారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిజెపి సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు ప్రధాని మోదీ. మెరిట్ ఆధారిత నియామకాల వైపు గణనీయమైన పురోగతిని బీజేపీ పేర్కొంది. హర్యానా బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి జవహర్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ పారదర్శకంగా మరియు మెరిట్ ఆధారిత ప్రక్రియ ద్వారా 1.43 లక్షల ఉద్యోగ ఖాళీలను విజయవంతంగా భర్తీ చేసిందని చెప్పుకొచ్చారు. ఇది గతంలో జరిగిన అవినీతి విధానాలకు చాలా దూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ వాదనకు మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మద్దతు ఇచ్చారు, ఆయన పరిపాలన పార్చీ - ఖర్చీ అని పిలవబడే వ్యవస్థను నిర్మూలించిందని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది, అధికార ప్రతినిధి కేవల్ ధింగ్రా ఆరోపణలను నిరాధారమైనవని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన రిక్రూట్మెంట్లను పారదర్శకంగా నిర్వహించిందని, ఉద్యోగ నియామకాల కోసం ద్రవ్య మార్పిడితో కూడిన కొత్త అవినీతి రూపాన్ని బిజెపి ప్రవేశపెడుతోందని ధింగ్రా అన్నారు. 2021లో హర్యానా పబ్లిక్ సర్వీస్ కమీషన్ డిప్యూటీ సెక్రటరీని లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసిన సంఘటనను కూడా ఆయన హైలైట్ చేశారు, బిజెపి పాలనలో అవినీతి కొనసాగుతుందని ధింగ్రా అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా అందించడంలో బిజెపి తన రికార్డును చాటుకుంటుండగా, ప్రస్తుత ప్రభుత్వ ఉపాధి విధానాలు సరిపోవని కాంగ్రెస్ నొక్కి చెబుతోంది. వారు కేవలం తాత్కాలిక ఉద్యోగాలు లేదా రోజువారీ వేతన ప్రాతిపదికన నియామకాలు చేస్తున్నారని ఆరోపించింది. హర్యానాలో ఉపాధి పద్ధతులపై కొనసాగుతున్న ఈ ఘర్షణ భారతదేశంలో పాలన, పారదర్శకత మరియు అవినీతిపై పోరాటం గురించి పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications