ఆ 25 మంది రైతుల మృతికి కారణం మీరే.. మోడీ సర్కార్పై కాంగ్రెస్ గరం గరం..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే 25 మంది రైతులు కూడా చనిపోయారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. వీరి చావుకు కూడా కేంద్ర ప్రభుత్వం కారణం అని వాదించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విరుచుకుడ్డారు.
తమ సమస్యల కోసం ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరసన తెలుపుతున్నారని తెలిపారు. అయితే ప్రధాని మోడీ మాత్రం మధ్యప్రదేశ్ రైతులతో మాత్రం సంప్రదింపులు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. దీనినిబట్టి మోడీ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే పెద్ద వ్యాపార సంస్థగా అవతరించిందని పేర్కొన్నారు.
రైతుల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వనరులు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని.. రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసిందని ఫైరయ్యారు. కొత్త వ్యవసాయ చట్టం అమల్లోకి రావడంతో మధ్యప్రదేశ్లో 47 మండీలు మూసివేశామని రైతులు చెబుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక అవుతాడని తెలిపారు. 99.9 శాతం మంది తిరిగి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.