మోడీ ప్రవేశపెట్టిన పథకాలు భారత నవశఖాన్ని ఆవిష్కరిస్తున్నాయి
ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చాలా వరకు మంచి పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాదు మంచి పాలన అందించేందుకు మరెన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. 2014లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనా లేదా ఉజాలా స్కీమ్..ఇలా ఏది తీసుకున్నా వాటిని నెరవేరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మోడీ సర్కార్ ఆన్లైన్ మీడియాను విరివిగా వినియోగించుకుంది.

భారత ప్రభుత్వం చొరవతో 700 రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సేవలందిస్తోంది. నెలకు 8 మిలియన్ మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమం చేస్తోంది రైల్వే శాఖ.

డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆర్థికలావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు మోడీ సర్కార్ తీసుకొచ్చింది. నగదు లావాదేవీలు తగ్గుముఖం పట్టి ... డబ్బులు చెల్లింపులకు కొత్త ఆన్లైన్ పేమెంట్ విధానాలు వచ్చాయి.
డిజిటల్ పద్ధతిలో జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వం అన్ని లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేదాన్ని మానిటర్ చేసేందుకు వీలైంది. అదే సమయంలో పన్ను ఎగవేతదారులపై కూడా ఓ కన్నేసి ఉంచొచ్చు. పన్ను ఎగవేత దారులు ఎక్కువయ్యే కొద్ది... ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది.

మోడీ ప్రభుత్వంలో డిజిటల్ ఇండియాకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే డిజిటల్ లాకర్ను ప్రవేశ పెట్టారు. ఇది వినియోగించి వినియోగదారులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను ఈ క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరుచుకునే అవకాశముంటుంది. డిజిటల్ లాకర్లో భారత పౌరులు వారికి సంబంధించిన ముఖ్య డాక్యుమెంట్లు అంటే ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్లను 10 ఎంబీ వరకు ఇందులో భద్రపరుచుకోవచ్చు. వీటిని భద్రపరచుకోవడం ద్వారా ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీలకు డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే డిజిటల్ లాకర్లో ఉన్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయొచ్చు.

ఉమాంగ్( UMANG)లేదా యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రభుత్వ సేవలను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ గతేడాది నవంబర్లో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్, ఆధార్, పంట బీమా, ఈపీఎఫ్, జాతీయ పెన్షన్ పథకాల సేవలను వినియోగించుకోవచ్చు.

-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications