‘టైమ్’ 100మంది ప్రభావశీలుర జాబితాలో మోడీ, కేజ్రివాల్
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్థానం దక్కించుకున్నారు. టైమ్ మేగజైన్ నిర్వహించిన ఆన్లైన్ పోల్స్లో రీడర్స్ పాల్గొని 100మందిని ప్రభావశీలురుగా ఎన్నుకున్నారు. ఈ వందమందిలో మోడీ, కేజ్రివాల్ ఉన్నారు.
ఈ సంవత్సరం టైమ్ 100 రీడర్స్ పోల్స్లో రీడర్స్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విజేతగా నిలిపారు. 6.95శాతం ఓట్లతో పుతిన్ అగ్రస్థానాన్ని సాధించారు. పాప్ స్టార్ లేడీ గాగ(2.6శాతం), రిహానా(1.9శాతం), టేలర్ స్విఫ్ట్(1.89)లు వరుసగా టాప్-5లో స్థానం దక్కించుకున్నారు.
ఈ వారం చివరలో అధికారిక జాబితాను విడుదల చేస్తామని టైమ్ ఎడిటర్స్ తెలిపారు. అప్పటి వరకు రాజకీయ, వినోదం, వ్యాపారం, సాంకేతికత, సైన్స్, మత, ఇతర సంబంధిత రంగాలలో ప్రభావశీలంగా ఉన్నవారి కోసం ఓటు వేయాలని సూచించారు. మంచిదైనా.. చెడ్డదైనా ఎలాంటి ప్రభావం చూపినా ఓటు వేయవచ్చని తెలిపింది.
కాగా, నరేంద్ర మోడీ 0.6శాతం ఓట్లు మాత్రమే సాధించారు. ఆయనకు అనుకూలంగా 34శాతం ఓట్లు రాగా, 66శాతం వ్యతిరేకంగా వచ్చాయి. ఇది ఇలా ఉండగా అరవింద్ కేజ్రివాల్కు 0.5 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, 71శాతం మంది కేజ్రివాల్ ఈ జాబితాలో ఉండరని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొదట జాబితాలో ఉన్నప్పటికీ ఓట్లు సాధించలేకపోవడంతో ఆయన 100మంది జాబితాలో చోటు దక్కలేదు.
ఇంకా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో హిల్లరీ క్లింటన్, దలైలామా, నటి ఎమ్మా వాట్సన్, నోబెల్ గ్రహీత మలాల యుసుఫ్ జాయ్, పోప్ ఫ్రాన్సిస్, బరాక్ ఒబామా, అమెరిక ప్రథమ మహిళ మిచెల్ ఓబామా, ఫేస్బుక్ సిఈఓ మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సిఈఓ టిమ్ కుక్, చైనా అధ్యక్షుడు జింపింగ్, రేపర్ కాన్యే వెస్ట్, మీడియా మోగుల్ ఓప్రాహ్ విన్ఫే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ, యాహూ సిఈఓ మేరీసా మేయ్ ఉన్నారు.