ఆ మూడు మోడీ కీర్తిని పెంచాయి
ఎన్నికల వేళ నువ్యా నేనా అనే రీతీలో పార్టీల మధ్య పోరు జరుగుతోంది,ఈనేపథ్యంలోనే పార్టీల అగ్రనాయకులు ప్రజలను ఆకర్షించే పథకాలు,స్కీములు వెల్లువల ముందుకువస్తున్నాయి. అయితే ఇలాంటీ పథకాలే ప్రధాని మోడీ కీర్తిని పెంచాయని ఢిల్లికి చెందిన సీఎస్డీఎస్-లోక్నిటి సంస్థ తెలిపింది. నెల రోజుల్లోనే మోడీ పథకాలు ఆయన ఇమెజ్ ను పెంచాయని తేల్చింది, ఆ సర్వే
ప్రధాని మోదీ ఇటివల తీసుకున్న మూడు నిర్ణయాలు ఆయన ఇమేజ్ ను బాగా పెంచాయి. అంతుకు ముందున్న పరిస్థితి కంటే కీలక నిర్ణయాల వల్ల మరో 9 శాతం ప్రజలు అదనంగా ప్రధానికి మద్దతుగా నిలిచారు. సీఎస్డీఎస్-లోక్నిటి సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది. జనవరి ఏడు నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన పలు సంఘటనలు,తీసుకున్న నిర్ణయాలు ఇందుకు కారణమయ్యాయి. ఇందులో ముఖ్యంగా జనవరి 7న అగ్రవర్ణపేదల కోసం విద్యాఉద్యోగావకాశాల్లో అగ్రవర్ణ పేదల కోసం చట్టసభల్లో మోడీ తీసుకువచ్చిన పది శాతం రిజర్వేషన్ , ఫిబ్రవరి 1న ప్రకటించిన, రైతులకు నేరుగా డబ్బును ఇచ్చే పథకమైన పీఎం-కిసాన్ తోపాటు పుల్వామా దాడి తర్వాత జరిగిన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్ణయాలు మోదీకి ప్రజల్లో అనుకూలతలను పెంచాయని సర్వే పేర్కోంది.

మోదీకి అనుకూలంగా 43%
2019 లో సీఎస్డీఎస్-లోక్నిటి -ది హిందు-దైనిక్ భాస్కర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మోడికి అనుకూలంగా 43 శాతం మంది ప్రజలు ఉన్నారు.అయితే అంతకుముందు 2014 ఎన్నికల్లో ఈ సంస్థలు నిర్వహించిన ఆయా రాష్ట్రాల్లో మోడికి అనుకూలంగా 34 శాతం ప్రజలు సపోర్ట్ చేశారు. కాగా అంతకు ముందుకంటే ఇప్పుడు నిర్వహించిన సర్వలో అదనంగా తోమ్మిది శాతం ప్రజల మద్దతు లభించిందని పేర్కోంది.అయితే బీజేపీకి చెందిన హింది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినా మోది ప్రభావం పెరగడం గమనించాల్సిన విషయం.
అడిగిన ప్రశ్నలు , సమధానాలు.
రానున్న ఎన్నికల్లో ప్రధానిగా మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు,
May-14 may-17 Jan-18 May-18 Pre Poll '19
Narendra Modi 36 44 37 34 43
Rahul Gandhi 16 9 20 24 24
Mayawati 2 3 3 3 3
Mamata Banerjee 1 1 3 3 2
Other leaders 17 19 18 19 13
No response 28 24 19 17 15












Click it and Unblock the Notifications