వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని టార్గెట్ చేసి నెటిజన్లకు ఘోరంగా బుక్కైన కేజ్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా దానినిలో తప్పును వెతికే పనిలో కేజ్రీవాల్ ఉన్నారనే అభిప్రాయం ఉంది. తాజాగా, మరోసారి ఆయన మోడీని టార్గెట్ చేసుకున్నారు. దీనికి నెటిజన్లు కేజ్రీకి కౌంటర్ ఇచ్చారు.

వారణాసిలో సోమవారం ఈ - బోట్స్‌, ఈ - రిక్షాలు ప్రారంభించిన ప్రధాని మోడీ.. అనంత‌రం వాటిపై కాసేపు ప్ర‌యాణించారు. అయితే వాటిపై ఓలా, రిలయన్స్ సంస్థల పోస్ట‌ర్లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కేజ్రీవాల్... ఇది ఈ - బోట్స్‌, ఈ - రిక్షాలు ప్రారంభించే కార్య‌క్ర‌మ‌మా..? లేదా ఓలా, రిలయన్స్ సంస్థ‌ల‌కు మోడీ ఇచ్చే ప్ర‌క‌టన కార్య‌క్ర‌మ‌మా? అనే అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్‌ను గమనించిన పలువురు నెటిజన్లు.... కేజ్రీవాల్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఆయన పైన చిత్రవిచిత్రంగా స్పందిస్తున్నారు. ఆయన చేతిలో యాపిల్ సెల్ ఫోన్ ఉంటే.. మీరు యాపిల్ ఫోన్‌కు ప్రచారం చేస్తున్నారా అని, పాన్ డబ్బా వద్ద నిలబడి ఉండగా ఉన్న ఫోటోను పెట్టి.. సిగరేట్‌కు ప్రచారకర్తనా అని, ఎయిర్ టెల్ ప్రతినిధులతో ఉన్న ఫోటోను పెట్టి.. ఎయిర్ టెల్ ప్రచారకర్తనా అని కౌంటర్ ఇచ్చారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal took Twitter by storm yet again. This time, the provocation came when he took at a dig at Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X