మొదట మీరు 10 మంది పిల్లల్ని కనండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: హిందువులను రెచ్చగొడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ మొదట తానే పది మంది పిల్లలను కనాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
హిందువులను ఎక్కువ పిల్లలను కనమని చెబుతున్న మోహన్ భాగవత్ ఆ పని ఎందుకు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఆయనే మొదట ఆ పని చేయాలన్నారు. పది మంది పిల్లలకు జన్మను ఇచ్చి వారిని బాగా పెంచి పెద్ద చేయాలన్నారు.
తన ప్రకటనను మోహన్ భాగవత్ ఆచరణలో చూపాలన్నారు. ఆ తర్వాత ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో మోహన్ భాగవత్కు సూచన చేశారు.

మోహన్ భాగవత్ ఇటీవల మాట్లాడుతూ.. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనవద్దని ఏ చట్టం చెబుతోందని ప్రస్నించారు. అలాంటి చట్టం ఏమీ లేదన్నారు.
ఇతరులు తమ జనాభాను పెంచుకుంటున్నప్పుడు మనకు అడ్డు ఏమిటన్నారు. ఇది సిస్టంకు సంబంధించినది కాదన్నారు. అయితే మోహన్ భాగవత్.. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనవచ్చునని అభిప్రాయపడ్డారు. కానీ దీనిపై కేజ్రీవాల్ విమర్శలు చేయడం గమనార్హం.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications