మూలిగే నక్కపై తాటిపండు!: బ్యాంకు సెలవులతో కరెన్సీ కష్టాలు తీవ్రం
నాలుగో శనివారం కారణంగా నేడు.. ఆదివారం కావడంతో 27వ తేదీ నాడు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక భారత్ బంద్ సెగ బ్యాంకులకు కూడా తాకితే.. మూడు రోజుల పాటు తీవ్రమైన నగదు కష్టాలను ఎదుర్కోక తప్పదు.
హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది దేశంలో సామాన్యుల పరిస్థితి. ఇప్పటికే నోట్ల కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు.. రెండు రోజుల వరుస బ్యాంకు సెలవులు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టేలా తయారయ్యాయి. సోమవారం నాడు ప్రతిపక్షాల భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా తోడైతే ఇక ఆ కష్టాలు మరింత తీవ్రతరం అవడం ఖాయం.

నాలుగో శనివారం కారణంగా నేడు.. ఆదివారం కావడంతో 27వ తేదీ నాడు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక భారత్ బంద్ సెగ బ్యాంకులకు కూడా తాకితే.. మూడు రోజుల పాటు తీవ్రమైన నగదు కష్టాలను ఎదుర్కోక తప్పదు. రూ.500నోటు మార్కెట్లోకి రావడంతో.. కాస్తంత ఉపశమనం కలిగిందని భావిస్తున్న తరుణంలో.. వరుస సెలవులు సామాన్యుల కష్టాలను మరింతగా పెంచనున్నాయి.
బ్యాంకుల బంద్ కు తోడు.. దేశంలో చాలా ఏటీఎంలు 'అవుట్ ఆఫ్ సర్వీస్' బోర్డుతోనే దర్శనమిస్తుండడం.. సామాన్యుడిలో తీవ్ర అసంతృప్తిని కలగజేస్తున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో.. ఏటీఎం కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటే.. బ్యాంకు సెలవుల ఎఫెక్ట్ కొద్దిలో కొద్దిగానైనా తగ్గే అవకాశముండేది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications