కదులుతున్న బస్సులో ప్రసవం.. బయటకు విసిరిపారేసిన కసాయి తల్లి
అమ్మతనం ప్రతి స్త్రీకి ఎంతో ప్రత్యేకం. గర్భం దాల్సిన నాటి నుంచి తన కలల పంట పుట్టి పెరిగేంత వరకు తనను తాను మర్చిపోయి పుట్టిన బిడ్డ కోసం తన సర్వస్వాన్ని దారపోస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డ పాలిట యమపాశంగా మారింది. కదులుతున్న బస్సులో బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టింది. ఆ పసిగుడ్డును బస్సులో నుంచి బయటకు విసిరిపారేసింది. కళ్లు తెరవని ఆ చిన్నారిని రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పర్బణీలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల యువతితో ఆమె భర్త అని చెప్పుకొని బస్సు ఎక్కిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలో పర్బణీ నుంచి పుణె వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే ఒక వస్త్రంలో చుట్టి ఏదో బయట పడేశారు. కిటీకీలోంచి అది చూసిన డ్రైవర్.. ఏదో బయట పడేశారని గమనించాడు. డ్రైవర్ బస్సు ఆపి.. వెనుకకు వచ్చి వారిని అడిగినప్పుడు.. బస్సు ప్రయాణం కారణంగా తన భార్యకు వికారం వచ్చి వాంతి చేసుకుందని సదరు వ్యక్తి చెప్పాడు. ఇంతలో రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి కిటికీలోంచి పడేసిన గుడ్డను తనిఖీ చేయగా.. ఒక పసిబిడ్డ అని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులంతా ఆ జంటను నిలదీశారు. వెంటనే 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో రితికా ధేరే, అల్తాఫ్ షేక్ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను పోషించే స్థోమత లేకపోవడం వల్ల తాము నవజాత శిశువును పడేశామని ఆ జంట చెప్పింది. రోడ్డుపై పడేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రితికా ధేరే, అల్తాఫ్ షేక్ ఇద్దరూ పర్బణీకి చెందిన వారే. గత ఒకటిన్నర సంవత్సరం నుంచి పుణెలో నివసిస్తున్నారు. తాము భార్యాభర్తలమని చెప్పుకున్నారు కానీ.. దానిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత, పోలీసులు మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సదరు యువతి డిశ్చార్జి అయిన అనంతరం జంటను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరణించిన మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications