తృణమూల్ ఎంపీపై పిడిగుద్దులు

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి చోటు చేసుకున్న తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయాలను పలుచోట్ల ధ్వంసం చేశారు రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. శనివారం తృణమూల్ లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీపై దాడి చోటు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే అదే పార్టీకి చెందిన మరో ఎంపీపై ఇటువంటి ఘటనే సంభవించింది.

తృణమూల్ సీనియర్ నాయకుడు, శ్రీరామ్ పూర్ లోక్ సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీపై తాజాగా హుగ్లీ జిల్లాలో దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడి, పార్టీ నాయకులు, కార్యకర్తల అరెస్టులకు నిరసనగా చేపట్టిన ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసనల్లో భాగంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి వ్యతిరేక నినాదాలు చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకన్నారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది. మొదట ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరిగింది. ఇది దాడికి దారితీసింది.

MP Kalyan Banerjee Injured in Clash Outside Chanditala Police Station as TMC-BJP Tensions Escalate

తమ పార్టీ నాయకులను విడుదల చేయాలంటూ హుగ్లీ జిల్లా పరిధిలోని చండితాల పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందించడానికి వెళ్తోన్న సమయంలో బీజేపీ నాయకులు ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. చోర్.. చోర్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపించినప్పుడు కల్యాణ్ బెనర్జీ, ఆయన అనుచరులు, టీఎంసీ కార్యకర్తలను కొందరు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనను చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పిడిగుద్దులు గుద్దారు. కిందికి తోసివేశారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తక్షణమే జోక్యం చేసుకున్నారు. వారిని విడిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకులు తనపై రాళ్లు విసిరినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారిపై ఘాటు విమర్శలు చేశారు. స్వయంగా సువేందు అధికారి ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తోన్నాడని, అతనొక నిరంకుశుడని మండిపడ్డారు. తమ పార్టీని ఎలాగైనా మట్టుబెట్టాలనుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

బెంగాల్ ప్రజలను ఉద్దేశించి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడారు. ప్రజలు మేల్కొనాలని అన్నారు. నేడు తనను కొడుతున్నారని, కులం, మతం పేరుతో రేపు సామాన్య ప్రజలను కూడా బీజేపీ బీజేపీ గూండాలు తరిమికొడతారని ఆరోపించారు. అలాంటి సందర్భంగా వస్తే ప్రజల పక్షాన ఎవరూ ఉండబోరని తేల్చి చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఉన్నంతకాలం తాము పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ గూండాల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇక్కడి స్వాతంత్ర్యం హరించారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+