సుమలత సంచలన నిర్ణయం, అయితే ?, నేను ఎక్కడికి వెళ్లను, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ముఖ్యం !
లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని, ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని బీజేపీ నాయకులు జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అయితే అంతా సవ్యంగా సాగినా మండ్య ఎంపీ సీటు విషయంలో ఈ రోజు వరకు బీజేపీ, జేడీఎస్ నాయకులు ఇన్ని రోజులు ఏం చెయ్యాలో తెలీక తలలు పట్టుకుంటూనే వచ్చారు.
మండ్య ఎంపీ సుమలత అంబరీష్ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులు హడలిపోయారు. అయితే బుధవారం మండ్య జిల్లా ప్రజలతో పాటు బీజేపీ, జేడీఎస్ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. తన మద్దతుదారులతో సమావేశం అయ్యి చర్చలు జరిపిన మండ్య ఎంపీ సుమలత అంబరీష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమలత నిర్ణయంతో బీజేపీ నాయకుల కంటే జేడీఎస్ నాయకులు చాలా సంతోషంగా ఎగిరిగంతేస్తున్నారు.

ఈ సందర్బంగా ఎంపీ సుమలత మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలు అంటే తమాషా కాదన్నారు. ద్వేషం కోసమో, మొండితనం కోసమో తాను పోటీ పడాల్సి వస్తే ఇంకా తాను పోటీ చెయ్యడానికి సిద్దమే అని, , అయితే దీని వల్ల ఎవరు నష్టపోతారో కూడా మనం ఆలోచించాలని మండ్య ఎంపీ సుమలత అన్నారు. నేను కేవలం ఎంపీ కావాలనుకుంటే బీజేపీ గెలవగలిగే చాలా నియోజకవర్గాల్లో తాను ఎంపీగా పోటీ చేసి ఉండేదానిని అని, అయితే తాను సాధారణ రాజకీయ నాయకురాలిని కాదని సుమలత అన్నారు.

తనకు ఎలాంటి రాజకీయాలు ఉన్నా అది కేవలం మండ్యలో మాత్రమే అని, మండ్య లేకపోతే తనకు రాజకీయాలు అక్కర్లేదని సుమలత అంబరీష్ కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పారు. అంబరీష్ అభిమానులు ఉండే మండ్యను వదిలి వెళ్లాలని తాను కలలో కూడా అనుకోనని, అందుకే తాను వేరే లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యలేదని సుమలత వివరణ ఇచ్చారు. మండ్యను ఎందుకు వదలడం లేదనే దానికి సుమలత వివరణ ఇచ్చారు.
తాను ఎంపీ అయిన తరువాత మండ్యలో 4 వేల కోట్లతో మండ్య జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని, ప్రధాని మోదీ చలువ వలనే అంత మొత్తంలో మండ్యకు నిధులు మంజూరు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని సుమలత అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని, అయితే తాను పోటీ చెయ్యదలచుకోలేదని అన్నారు. గతంలో సుమలత అవసరం మాకు లేదని, భవిష్యత్తులోనూ ఆమె అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారని, అయితే తనకు గౌరవం లేని చోటికి నేను వెళ్లను అని సుమలత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ పట్ల ఎంతో గౌరవంతో ఆ పార్టీకి మద్దతివ్వాలని అనుకున్నానని, ఇప్పుడు అదే చేస్తున్నానని సుమలత చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థ రాజకీయాలు చేయకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, నేను ఈరోజు మండ్యలో ఎంపీగా ఉన్నానని, రేపు మరో పదవి పొందవచ్చు అని, తరువాత కూడా తాను మండ్య ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సుమలత అన్నారు. తాను త్వరలో బీజేపీలో చేరుతున్నానని, కాంగ్రెస్ లో ఎట్టిపరిస్థితుల్లో చేరని ఎంపీ సుమలత క్లారిటీ ఇచ్చారు. సుమలత నిర్ణయంతో మండ్యలో ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications