శశికళకు షాక్ ఇచ్చిన రెబల్ ఎంపీలు: పళని, పన్నీర్ గూటికి జంప్, టీటీవీకి ఝలక్ !
అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. శశికళ వర్గంలోని ఎంపీలు వరుసగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి,
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. శశికళ వర్గంలోని ఎంపీలు వరుసగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతున్నారు.
అన్నాడీఎంకే పార్టీ రాజ్యసభ ఎంపీలు నవనీతక్రిఫ్ణన్, విజిల సత్యానంద్, గోకుల క్రిఫ్ణ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గానికి ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు శశికళ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకుని చివరికి మకాం మార్చేశారు.

తాజాగా మరో ఇద్దరు లోక్ సభ సభ్యులు శశికళ, దినకరన్ కు హ్యాండ్ ఇచ్చి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు. వేలూరు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ బి. సెంగోట్టవన్, దిండుగల్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ ఎం. ఉదయ్ కుమార్ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు.
అభివృద్ది పనుల విషయం గురించి సీఎం ఎడప్పాడి పళనిస్వామితో మాట్లాడి వస్తామని ఎంపీలు ముందుగా తనకు సమాచారం ఇచ్చి వెళ్లారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు. అయితే టీటీవీ దినకరన్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ఆయనతో మేము భేటీ కాలేదని ఎంపీ నవనీతక్రిష్ణన్ తేల్చి చెప్పారు. మొత్తం మీద టీటీవీ దినకరన్ వర్గంలోని ఐదు మంది రెబల్ ఎంపీలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంలోకి జంప్ అయ్యారు.












Click it and Unblock the Notifications