చిదంబరంకు పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..! కాబోయే ప్రధాని అందుకే వేధిస్తున్నారంటూ కామెంట్స్

కేంద్రమాజీ మంత్రి పీ చిదంబరానికి దాయాదీ పాకిస్థాన్ నుండి కూడ మద్దతు లభిస్తోంది. చిదంబరం ఎంతో సామర్ధ్యం ఉన్న నేత అని, దీంతో దేశానికి ప్రధానమంత్రి అవుతారని, అందుకే ఆయనపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారని పాకిస్థాన్ మాజీ విదేశంగా మంత్రి రెహమాన్ మాలిక్ అన్నారు. ముఖ్యంగా చిదంబరం కశ్మీరీలకు మద్దతుగా మాట్లాడినందుకు ఆయన్ను వేధిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాటు, కశ్మీర్ విభజనను వ్యతిరేకించినందుకే ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నాడు.

ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ విభజనపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే చిదంబరం చేసిన తప్పని ఆయన ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇక కశ్మీర్‌లో ముస్లింల ఊచకోతకు ప్రధాని నరేంద్రమోడీ ఆర్ఎస్ఎస్ నేతలకు ఫ్రీడం ఇచ్చారని ఆరోపించాడు. కాగా రెహమాన్ అంతకుముందు కూడ రాహుల్ గాంధీ కూడ దేశానికి కాబోయో ప్రధానమంత్రి చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే ఆయన దృష్టి చిదంబరంపై మరల్చారు. ఇప్పుడు చిదంబరం కాబోయో ప్రధాని అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు కశ్మీర్ అంశాన్ని కూడ ఆయన ముడిపెట్టాడు.

Mr Chidambaram is going to be next PM

కాగా చిదంబరం అరెస్ట్‌పై కాంగ్రెస్ నేతలు కూడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. కశ్మీర్ అంశాన్ని దృష్టి మరల్చడానికే చిదంబరం అరెస్ట్ హంగామా సృష్టిస్తున్నారని, కశ్మీర్ అంశలో మద్దతు పలికినందుకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా పాకిస్థన్ నేతలు కూడ చిదంబరానికి మద్దతు పలకడం కోసమేరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+