ముంబైలో ఘోర పడవ ప్రమాదం: 13 మంది మృతి, పలువురు గల్లంతు
ముంబై సముద్ర తీరంలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తోన్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
కాగా, ఈ ఘటన ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారికోసం గాలింపు కొనసాగుతోందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'గేట్ వే ఆఫ్ ఇండియా' నుంచి ఎలిఫెంటా గుహలకు 'నీల్కమల్' అనే ఫెర్రీ.. 110 మందికిపైగా పర్యటకులతో బయల్దేరింది. అయితే, చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునిగిపోయింది. దీంతో తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
A ferry boat carrying 35 tourists from Elephanta Island to #Mumbai’s Gateway of India capsized near the island around 4 PM. Coast Guard and Navy teams have rescued most passengers, while search operations for the missing are underway. pic.twitter.com/W1xrcKsFgi
— Madhuri Adnal (@madhuriadnal) December 18, 2024
వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 101 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. అయితే, అప్పటికే లైఫ్ జాకెట్లు కాపాడలేకపోవడంతో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#breaking A boat carrying people from gateway of India in Mumbai to elephanta caves capsized near gateway . Ferry neelkamal has sunk in uran having 30-35 people .Relief and rescue operations are undergoing #Mumbai #BreakingNews pic.twitter.com/51DhGwAGlU
— Anshul (@anshulmumbaidel) December 18, 2024
'ఎలిఫెంటా ద్వీపానికి వెళ్లే మార్గంలో నీల్కమల్ పడవ ప్రమాదానికి గురైందని మాకు సమాచారం అందింది. నేవీ, కోస్ట్ గార్డ్, పోర్ట్, పోలీసు బృందాల నుంచి రెస్క్యూ బోట్లను వెంటనే పంపించారు. మేము జిల్లా, పోలీసులతో నిరంతరం టచ్లో ఉన్నాం. చాలా మంది ప్రయాణీకులను కాపాడటం జరిగింది. అయితే రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ప్రయత్నాల కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించమని జిల్లా అధికారులకు సూచించాం' అని సీఎం ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
एलिफंटाकडे जाणाऱ्या नीलकमल या बोटीचा अपघात घडल्याचे वृत्त प्राप्त झाले. नौदल, कोस्टगार्ड, पोर्ट, पोलिस पथकच्या बोटी तातडीने मदतीसाठी रवाना करण्यात आल्या आहेत. जिल्हा आणि पोलिस प्रशासनाशी सातत्याने आम्ही संपर्कात असून, सुदैवाने बहुसंख्य नागरिकांना वाचविण्यात आले आहे. तथापि अजूनही…
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 18, 2024
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications