సబర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు (పోటోలు)
ముంబై: సెంట్రల్ సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు శుక్రవారం ఉదయం దివా స్టేషన్లోని ట్రాక్పై తమ నిరసనను తెలిపారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో థానే జిల్లాలోని కళ్యాణ్ స్టేషన్కు సమీపంలో ఉన్న తాకుర్లీ స్టేషన్ వద్ద లోకల్ రైలు పవర్ సప్లై వైరు చిక్కుకుంది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఆ లైనుకి పవర్ సప్లై నిలిపివేసి కళ్యాణ్-థానే మధ్య మిగిలిన మూడు మార్గాల్లో రైళ్లను మళ్లించారు. ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి అయ్యేందుకు రైల్వే అధికారులకు 120 నిమిషాలు పట్టింది.
సాధారణంగా ప్రతి 5 నిమిషాలకు ఒక లోకల్ రైలు ఆ రూట్లలో బీజీగా తిరుగుతూ ఉంటుంది. పవర్ వైరుని రిపేర్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఉదయం పూట కావడం... బాగా రద్దీ పెరగటంతో ప్రయాణీకులు రైలు పట్టాలపై తమ నిరసనను తెలిపారు.
రైళ్ల ఆలస్యానికి నిరసగా తొలుత దివా స్టేషన్లో ప్రయాణీకులు నిరసన తెలపడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న స్ధానికులు కూడా వారితో జతకలవడంతో రైళ్ళను వెళ్లకుండా ట్రాక్లపై తమ నిరసనను తెలియజేయడంతో.. దీని ప్రభావం సెంట్రల్ రైల్వేపై పడింది.

సబ్అర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు
సెంట్రల్ సబ్ అర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు శుక్రవారం ఉదయం దివా స్టేషన్లోని ట్రాక్పై తమ నిరసనను తెలియజేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో థానే జిల్లాలోని కళ్యాణ్ స్టేషన్కు సమీపంలో ఉన్న తాకుర్లీ స్టేషన్ వద్ద లోకల్ రైలు పవర్ సప్లై వైరు చిక్కుకుంది.

సబ్అర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు
ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి అయ్యేందుకు రైల్వే అధికారులకు 120 నిమిషాలు పట్టింది. పవర్ వైరుని రిపేర్ చేసందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో రైల్వే స్టేషన్లలో ఉదయం పూట కావడం... బాగా రద్దీ పెరగటంతో ప్రయాణీకులు రైలు పట్టాలపై తమ నిరసనను తెలిపారు.

సబ్అర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు
రైళ్ల ఆలస్యానికి నిరసగా తొలుత దివా స్టేషన్లో ప్రయాణీకులు నిరసన తెలపడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న స్ధానికులు కూడా వారితో జతకలవడంతో రైళ్ళను వెళ్లకుండా ట్రాక్లపై తమ నిరసనను తెలియజేయడంతో.. దీని ప్రభావం సెంట్రల్ రైల్వేపై పడింది.

సబ్అర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు
ఈ విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జీ చేసినా ప్రయాణీకులను ట్రాక్పై నుంచి తీసుకెళ్లడంలో విఫమయ్యారు. ఇంక పరిస్ధితి అక్కడ సద్దుమణగలేదు.

సబ్అర్బన్ రైళ్లు ఆలస్యం, విధ్వంసానికి దిగిన ప్రయాణీకులు
రైళ్ల ఆలస్యానికి నిరసగా తొలుత దివా స్టేషన్లో ప్రయాణీకులు నిరసన తెలపడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న స్ధానికులు కూడా వారితో జతకలవడంతో రైళ్ళను వెళ్లకుండా ట్రాక్లపై తమ నిరసనను తెలియజేశారు.
దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై కూడా ప్రభావం ఉండటంతో పలు రైళ్లు పాక్షికంగా నిలిచిపో్యాయి. ప్రస్తుతం నాలుగు ట్రాక్ లపై రైళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.
రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలనే తేడా లేకుండా కంటికి కనిపించిన వాహనాలపై దాడికి దిగారు. వాహనాలపై రాళ్లు రువ్విన ప్రయాణీకులు అప్పటికీ ఆగ్రహం చల్లారక పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఆందోళనల్లో 15 వాహనాల దాకా అగ్నికి ఆహుతయ్యాయి.
దీంతో పరిస్థితి ఉద్రిక్త మారడంతో వారిని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆందోళనకారులపై లాఠీచార్జికి దిగారు. ముంబై సబ్అర్బన్ రైళ్లు రోజూ కొన్ని లక్షల మందిని వారి గమ్యస్ధానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.












Click it and Unblock the Notifications