ముంబైలో దారుణం- హిందూ యువతితో కలిసి వెళ్తున్నాడని ముస్లిం యువకుడిపై మూక దాడి...
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఇంత అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా చెప్పుకుంటున్న ముంబైలో ఉన్న బాంద్రా టెర్మినస్ లో ఓ హిందూ-ముస్లిం యువతీ యువకులు కలిసి వెళ్తుండగా చూసిన గుంపు మూకదాడికి పాల్పడింది. విచక్షణా రహితంగా బూతులు తిడుతూ ఆ యువకుడిని చితకబాదింది. ఈ దృశ్యాల్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రీ ఫ్రెస్ జర్నల్ వెబ్ సైట్ బయటపెట్టింది.
ఓవైపు ముంబైలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సాగుతుండగా.. మరోవైపు హిందూ యువతితో తిరుగుతున్నాడనే ఆరోపణతో ఒక ముస్లిం యువకుడిని ఒక గుంపు దారుణంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తిని ఆ గుంపులో ఉన్న వారంతా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, మరోవైపు బూతులు తిడుతూ చెప్పులతో కొట్టడం కనిపించింది.

A #Muslim youth was thrashed at #Bandra terminus railway station in #Mumbai by a #Hindutva mob for going out with #Hindu girl. pic.twitter.com/Im3VzwIOSI
— Hate Detector 🔍 (@HateDetectors) August 15, 2023
ట్విట్టర్లోని కొందరు ఈ వీడియోను పోస్ట్ చేసి ముంబై పోలీసులు, రైల్వే పోలీస్ ఫోర్స్ ముంబై సెంట్రల్ డివిజన్ను ట్యాగ్ చేశారు. కానీ ముంబై పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే ఆర్పీఎఫ్ మాత్రం ఈ విషయం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో విపక్షాలు ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications