''భారత్'ను రక్షించాల్సిన అవసరం ఉంది'
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశంలో సామరస్యం కనిపించేదని, ఇప్పుడు అది కనిపించకుండా పోయిందని మండిపడ్డారు.
ఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశంలో సామరస్యం కనిపించేదని, ఇప్పుడు అది కనిపించకుండా పోయిందని మండిపడ్డారు.
ఒకప్పుడు ప్రజల్లో ఆత్మస్థైర్యం ఉండేదని, ఇప్పుడు వారిలో స్తబ్ధత నెలకొందన్నారు. ప్రజలను రెచ్చగొట్టేతత్వం ఇప్పుడు ఎక్కువ అవుతోందన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం నుంచి భారత్ ను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశం తిరోగమనం దిశలో ముందుకు సాగుతోందన్నారు. శాంతియుత పరిస్థితులు దెబ్బతిన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం నుంచి భిన్నత్వం వైపు అడుగులు పడుతున్నాయన్నారు.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, నేతలంతా వ్యక్తిగత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత్ అనే భావనను ప్రస్తుత ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన అవసరముందన్నారు.
దేశం తిరోగమన పరిస్థితుల్లో ఉందని, అది కూడా కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరితమైకాక శాంతియుత పరిస్థితులకు, భిన్నత్వ భావనకు పాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications