మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే కలకలం: రేపు సీఎం ఉద్ధవ్ నేతృత్వంలో కేబినెట్ భేటీ
ముంబై: మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నాయకులు మంగళవారం సాయంత్రం ముంబైలోని వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఎన్సీపీ నేతలు ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు.
ప్రస్తుత రాజకీయ సంక్షోభం దృష్ట్యా, మహారాష్ట్ర మంత్రివర్గం రేపు(బుధవారం) మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం కానుంది. కాగా, 17-18 మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ సిండేతో ఉన్నారని, మరికొందరిని బలవంతంగా ఆపుతున్నారని శివసేన నాయకుడు విక్రమ్ సింగ్ యాదవ్ అన్నారు.

ఏక్నాథ్ షిండే వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ శెట్టి స్పష్టం చేశారు.
శివసేన ఎందుకు బీజేపీని వీడిందో అందరికీ తెలుసు: సంజయ్ రౌత్
'మా వ్యక్తులు ఇద్దరు అక్కడికి (సూరత్) వెళ్లారు. ఏకనాథ్ షిండేతో చర్చలు జరిగాయి. ఆయన మా పాత మిత్రుడు.. మేం బీజేపీని ఎందుకు వదిలేశామో అందరికీ తెలుసునని, దానికి ఏకనాథ్ షిండే కూడా సాక్షి' అని మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications