వింత: మనిషి పోలికలతో పుట్టిన మేక పిల్లలు (ఫొటో)
మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కన్నది. అచ్చం మనిషి పోలికలతో ఉన్న మగ పిల్ల ఉదయం 6.30 గంటలకు పుట్టింది. ఐదుగంటల తర్వాత ఆడ మేక పిల్ల పుట్టింది.
ఆ మేకను తాను నాలుగేళ్లుగా పెంచుతున్నానని, అది ఇప్పటికీ పది పిల్లలను కనిందని.. అన్నీ బాగానే ఉన్నాయని యజమాని భాస్కర్ తెలిపాడు. అయితే ఇప్పుడు మాత్రమే ఇలాంటి మనిషి పోలికలో ఉన్న పిల్లలను కందని చెప్పాడు.

కాగా, మనిషిలాగా మేక పిల్ల పుట్టిందనే వార్త గ్రామంలో వ్యాపించడంతో తండోపతండాలుగా వచ్చిన జనాలు ఆ మేక పిల్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. మేక పిల్లలు ఇలా వింతగా పుట్టడం అరిష్టమని, అందువల్ల వెంటనే వాటిని పూడ్చేయాలని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వాసుదేవదాస్ మాట్లాడుతూ..వైద్య పరిభాషలో దీన్ని ఫీటల్ అనసర్టా అంటారని చెప్పారు. అంటే తల్లి కడుపులో ఉండాల్సిన ఉమ్మనీరు పిల్ల శరీరంలోకి వెళ్లిపోతే ఇలా జరుగుతుందని వివరించారు. జన్యుపరమైన తేడాల వల్ల కూడా ఇలా జరుగుతుందని తెలిపారు. ఆ రెండు మృత మేక పిల్లలను మైసూరు దసరా ఉత్సవంలో ప్రదర్శిస్తామని చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications