పదవి చేజారిపోతుందనే భయంతో పూజలు చేసిన సీఎం
చెన్నై: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రహస్యంగా యాగం నిర్వహించడం సంచలనం కల్గించింది.తన పదవిని కాపాడుకొనేందుకే సిఎం ప్రత్యేకంగా యాగం చేశారని చెబుతున్నారు.
తొలుత ఆయన పుదుచ్చేరికి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకొన్నారు. అయితే ఏదేనీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ఆరు మాసాల్లోపుగా ఎంఎల్ఏగా ఎన్నిక కావాలి. ముఖ్యమంత్రి పోటీచేసేందుకు వీలుగా నెల్లితోపు నియోజకవర్గం నుండి విజయం సాధించిన జానకుమార్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.

త్వరలో నెల్లితోపు లో జరిగే ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఆయన పోటీలో నిలిచారు.అయితే చివరి నిమిషంలో అన్నాడిఎంకె అభ్యర్థి ఓంశక్తిశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు.దీంతో ఈ ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారింది.
పుదుచ్చేరి కి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో నారాయణస్వామి విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.దరిమిలా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను నారాయణస్వామి శాయశక్తులను ఒడ్డుతున్నారు. పుదుచ్చేరిలోని ప్రసిద్ది చెందిన ఎల్లయమ్మన్ ఆలయంలో ఆయన అర్థరాత్రి ప్రత్యేక పూజలు, యాగం చేశారు.ఎన్నికల్లో విజయం చేకూరాలని ఆయన ఈ యాగం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications