త్వరలో మోడీ మంత్రివర్గ విస్తరణ: అరుణ్ శౌరీకి చోటు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మరో 20 మందికి అవకాశం కల్పిస్తూ మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. జూలై రెండో వారంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తొలి విడతలో స్థానం దక్కించుకోని బిజెపి నేతలు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఈసారి అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, బీహార్ నుంచి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం దక్కుతుందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో పార్టీని పటిష్టపర్చే ఉద్దేశంతో ఉన్న మోడీ ఆ రాష్ట్రానికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
రాజీవ్ప్రతాప్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నక్వీ లాంటి సీనియర్లకు ఈసారి బెర్తులు దక్కవచ్చని సమాచారం. అరుణ్ శౌరి, మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రామదాస్ అథవాలే వంటి వారికీ అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. అథవాలేకు చోటు కల్పించడం ద్వారా త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓటర్లను ఆకర్షించవచ్చని మోడీ భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణతోపాటు కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేయడంపై, పార్టీకి కొత్త చీఫ్ను నియమించడంపై మోడీ దృష్టిసారించనున్నారు. వృద్ధనేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకూడదన్న నియమం కారణంగా అలాంటి వారికి గవర్నర్లుగా అవకాశం కల్పించాలని ప్రధాని భావిస్తున్నారు.
ఈ రేసులో పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, రాజకీయ నాయకుడిగా మారిన ఐఎఫ్ఎస్ అధికారి హరదీప్ పూరి, బిజెపి వృద్ధ నేత లాల్జీ టాండన్ ఉన్నారు. వీరిలో పూరికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా, జోషీకి మహారాష్ట్ర గవర్నర్గా అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాంటున్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి జేపీ నడ్డా, ఓపీ మాధుర్లతోపాటు మోడీ సన్నిహితుడు అమిత్షా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications