మద్దతివ్వబోం: దాద్రి ఘటనపై మౌనం వీడిన మోడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు నోరు విప్పారు. దాద్రి తరహా ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆయన ఈ తరహా ఘటనలకు భారతీయ జనతా పార్టీ మద్దతివ్వబోదని తేల్చిచెప్పారు.
గోమాంసం తిన్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తిపై కొందరు హిందువులు దాడి చేశారు. ఈ ఘటనలో అఖ్లాఖ్ చనిపోగా, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీనిపై స్పందించేందుకు తొలుత కేంద్ర మంత్రులు వెనకడుగు వేసినా, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు ఈ ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు.

అయితే ప్రధాని మోడీ మాత్రం మంగళవారం దాకా దీనిపై నోరు విప్పలేదు. దీంతో విపక్షాలన్ని మోడీపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బెంగాల్కు చెందిన ఓ పత్రికతో మాట్లాడిన సందర్భంగా మోడీ.. దాద్రి ఘటనను ఖండించారు.
‘దాద్రి లాంటి ఘటన నిజంగా విచారకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేంటి? ఇలాంటి ఘటనలకు బిజెపి మద్ధతివ్వబోదు. ఈ తరహా ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బిజెపి విరుద్ధం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ గాయకుడు గులాం అలీపై జరిగిన వివాదాన్ని కూడా మోడీ ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని అన్నారు.
-
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications