మన్మోహాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో అభినందనలు తెలుపుతూ మన్మోహాన్ సింగ్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మోడీ ఆకాంక్షించారు.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Best wishes & warm greetings to Dr. Manmohan Singh ji on his birthday. May he be blessed with a long life & good health.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/515358397521080320">September 26, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>తన ఐదు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫ్రాంక్ ఫర్ట్, జర్మనీకి చేరుకున్నారు. 29న వాషింగ్టన్ వెళతారు. శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో తొలిసారి ప్రసంగిస్తారు.
ఈ ప్రసంగంలో మోడీ ఐరాసలో వేగంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రెండు దేశాలు ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై ఒబామాతో చర్చిస్తారు.
ఇక ఈనెల 29న అమెరికా అధ్యక్షడు బరాకా ఒబామా మోడీకి ప్రైవేటు విందు ఇస్తున్నారు. మరుసటి రోజు శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. భారత్లో నవరాత్రుల రోజుల్లో ప్రధాని మోడీ ఉపవాస దీక్షలో ఉంటారు.

దీంతో విందులో మోడీ టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. మరోపక్క మోడీ, ఒబామా భేటీపై వాషింగ్టన్లో అంచనాలు భారీగా పెరిగాయి. నరేంద్ర మోడీ ఈ పర్యటనలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, భారత్ అమెరికన్ అయిన దక్షిణ కరోలైనా గవర్నర్ నిక్కీ హేలీ సహా అమెరికాలోని రాజకీయ నాయకులను కలుసుకోనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1994లో అమెరికాలో పర్యటించారు. అమెరికాలో మోడీ పర్యటించడం ఇదో రెండో సారి. 1994లో మన దేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు అమెరికాకు వెళ్లారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా... మిగిలిన వారు బీజేపీకి చెందిన వారు. బీజేపీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్ర మంత్రి అనంతకుమార్ ఈ పర్యటనకు ఎంపికయ్యారు.
41 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో వీరంతా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించారు. తొలుత ఫ్రాన్స్ పర్యటించిన అనంతరం 'అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్' అధికారిక ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లారు. ఈ వివరాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అప్పట్లో నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. కిషన్ రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేసేవారు.
-
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications