గాంధేయ విలువలను కాపాడండి.. గవర్నర్లకు ప్రధాని సందేశం
గాంధేయ వాదాన్ని, విలువలను పరీరక్షించాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జాతిపిత బాపూజీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్ షా, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విలువలను పెంపొందించడానికి గాంధీజీ జయంతి ఉత్సవాలను వినియోగించుకోవాలి. రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి కృషి చేయాలి అని అన్నారు.

రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించే బాధ్యత గవర్నర్ల వ్యవస్థపై ఉంది. అలాగే సమాజంలోని మైనారిటీలతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పాటుపడాలి అని ప్రధాని సూచించారు. అలాగే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, టూరిజం తదితర రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కావున యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలి అని అన్నారు.












Click it and Unblock the Notifications