2019లో మళ్లీ మోడీయే ప్రధాని అవుతారు: రాకేష్ ఝన్ఝన్ వాలా
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావొచ్చునని భారత బిగ్ బుల్, ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విపక్షాలకు ఓ విధమైన అజెండా లేకుండా పోయిందన్నారు.
కేవలం నరేంద్ర మోడీని ఓడించడమే అజెండాగా వారు సాగుతున్నారని, ఈ క్రమంలో విజయం సాధించలేరని చెప్పారు. బీజేపీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయనే విషయాన్ని తాను చెప్పలేనని, కానీ మల్లీ ప్రధాని అయ్యేది మాత్రం మోడీయే అన్నారు.

నా భార్య రేపు ఏం చేస్తుందో నాకు తెలియదని, అలాంటప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో ఎలా చెప్పగలనని వ్యాఖ్యానించారు. నేను వ్యక్తిగతంగా బీజేపీ వస్తుందని భావిస్తున్నానని అన్నారు.
ప్రతిపక్షాలకు ఓ అజెండా లేదు కాబట్టి మోడీయే మళ్లీ వస్తారని మోడీ వస్తారని చెప్పారు. గత వారం తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో విపక్షాల అనైక్యత తేలిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications