2019లో మళ్లీ మోడీయే ప్రధాని అవుతారు: రాకేష్ ఝన్ఝన్ వాలా
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావొచ్చునని భారత బిగ్ బుల్, ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విపక్షాలకు ఓ విధమైన అజెండా లేకుండా పోయిందన్నారు.
కేవలం నరేంద్ర మోడీని ఓడించడమే అజెండాగా వారు సాగుతున్నారని, ఈ క్రమంలో విజయం సాధించలేరని చెప్పారు. బీజేపీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయనే విషయాన్ని తాను చెప్పలేనని, కానీ మల్లీ ప్రధాని అయ్యేది మాత్రం మోడీయే అన్నారు.
నా భార్య రేపు ఏం చేస్తుందో నాకు తెలియదని, అలాంటప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో ఎలా చెప్పగలనని వ్యాఖ్యానించారు. నేను వ్యక్తిగతంగా బీజేపీ వస్తుందని భావిస్తున్నానని అన్నారు.
ప్రతిపక్షాలకు ఓ అజెండా లేదు కాబట్టి మోడీయే మళ్లీ వస్తారని మోడీ వస్తారని చెప్పారు. గత వారం తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో విపక్షాల అనైక్యత తేలిందని చాలామంది అభిప్రాయపడ్డారు.