హైవేపై కారులో ఎగిసిన మంటలు: ఎన్సీపీ నేత సంజయ్ సజీవ దహనం
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఎన్సీపీ నేత సంజయ్ షిండే సజీవ దహనమయ్యారు.
ఎన్సీపీ నేత సంజయ్ షిండే తన కారులో ముంబై-ఆగ్రా హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో పింపల్గావ్ బస్వంత్ టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా కారు వైరింగ్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అతడు కారులోనే మృతి చెందాడు.

వైన్ ఇండస్ట్రీకి పేరుగాంచిన నాసిక్ జిల్లాలో సంజయ్ షిండే.. పండించిన ద్రాక్షలను ఎగుమతి చేస్తుంటాడు. తన ద్రాక్ష తోటకు ఎరువులు కొనుగోలు చేసేందుకు పింపల్గావ్కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడ్వా రివర్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోకి కారు వెళ్లగానే మంటలు అంటుకున్నాయి.
షార్ట్ సర్క్యూట్ తోపాటు కారులో శానిటైజర్లు కూడా ఉండటంలో మంటలు మరింత ఎగిసిపడ్డాయి. సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ కారణంగా కారు డోర్లు లాక్ కావడంతో అతడు కారులోనే చిక్కుకుపోయాడు. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పలించలేదు. దీంతో అతడు సజీవంగా దహనమయ్యాడు.
Recommended Video
ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు సంజయ్ షిండేను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications