కేజ్రీవాల్, ధోని పేర్లతో పిల్లర్పై డీ కోడ్తో ఐఎస్ రాతలు : నవీ ముంబైలో హై అలర్ట్
ముంబై : గత కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉగ్రవాదుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు పూర్తయి .. కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఐఎస్ ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తోన్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలోని పిల్లర్పై ఐఎస్ రాతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్తవారి వివరాలు ఆరాతీశాకే పంపిస్తున్నారు.

ఐఎస్ రాతలు ..
నవీ ముంబైలోని కోప్టే బ్రిడ్జిపై ఐఎస్ రాతలు కనిపించాయి. దీనిపై ఐఎస్ నేత అబు బకార్ ఆల్ బగ్దాదీ ఇతరుల పేర్లు ఉన్నాయి. దీంతోపాటు హఫీజ్ సయూద్ పేరును కూడా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానికుల తెలుపడంతో పోలీసులు పిల్లర్ను నిశీతంగా పరిశీలించారు. వారు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. దీనిపై మీడియా పోలీసులను ఆరాతీయగా .. పిల్లర్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేపర్లను రాశారని పేర్కొన్నారు. దీంతో ఎవరు రాశారు ? ఎందుకు రాశారనే కోణంలో విచారిస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.

బీర్ బాటిళ్లు ..
పిల్లర్పై రాతలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించారు. ఘటనాస్థలంలో బీర్ బాటిళ్లు, మగ్గులు, ఇతర వస్తువులు ఉండటంతో .. ఉగ్రవాదులు రాశారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అయితే సంఘటనాస్థలంలో స్థానిక యువత ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారని చెప్పారు. అక్కడ వారు మద్యం సేవిస్తారని చెప్పారని .. ఈ కోణంలో కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. ఏమైనా కానీ .. రాసిందేవరో అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగుతుందుని స్పష్టంచేశారు. దీంతోపాటు సీసీటీవీ ఫుటేజీని నిశీతంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

తేలికగా తీసుకోం ..
అయితే పిల్లర్పై రాసిన వ్యాఖ్యలను అంతా తేలికగా తీసుకోబోమని .. సరైన భద్రతా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పిల్లర్ పై డీ కోడ్ తో రాశారని .. అందుకే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ నేతలు, క్రికెటర్ల పేర్లు ఉండటంతో వారి లక్ష్యంగా కుట్రపన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు తెలిపారు. అంతేకాదు పిల్లర్ ఉన్న ఆరన్ సమీపంలో ఓఎన్జీసీ, విద్యుత్ కేంద్రం. జేఎన్పీటీ ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకతాయిల పనైనా .. దర్యాప్తు మాత్రం చేస్తామని .. ఉగ్రవాదుల, ఆకతాయిలో త్వరలో తేలుస్తామని స్పష్టంచేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications