19 ఏళ్ల యువతిని పొలంలో రేప్ చేసిన నయీం
ముజఫర్ నగర్ : ఓ 19ఏళ్ల యువతిపై నయీం అనే ఆమె బంధువు కన్నేశాడు. మాయ మాటలు చెప్పాడో లేక బెదిరింపులకు దిగాడో తెలియదు గానీ సమీపంలోని పొలం వద్దకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం దృశ్యాలను తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి.. విషయం బయటకు పొక్కితే వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
దీంతో సదరు బాధితురాలు విషయాన్ని ఇంట్లో వాళ్లకు సైతం చెప్పలేదు. అయితే ఈ లోగా నిందితుడు నయీం ఆ వీడియోను తన ఫ్రెండ్స్ కు లీక్ చేయడంతో.. విషయం బాధిత యువతి తల్లిదండ్రుల వరకు వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి తల్లిదండ్రులు నయీంపై ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తరుపు ఫిర్యాదు మేరకు నయీంపై ఐపీసీ 377, 376,66ఏ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలో ఉన్న న్యూమండీలో ఈ ఘటన చోటు చేసుకుంది.