ఈ విషయంలో బెంగళూరు నంబర్ వన్, హైదరాబాద్ కు ఎన్నో స్థానం అంటే ?, ఎన్ సీఆర్ బీ రిపోర్టు !
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2022లో బెంగళూరులో అత్యధికంగా మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయి, బెంగళూరు సిటీ పోలీసులు ఎనిమిది యాసిడ్ దాడుల కేసులు నమోదు చేశారని వెలుగు చూసింది. గణాంకాల ప్రకారం ఎన్ సీఆర్ బీ డేటాలో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో సర్వే చెయ్యగా యాసిడ్ దాడుల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
గతేడాది బెంగళూరు నగరంలో ఎనిమిది మంది మహిళలపై యాసిడ్ దాడి జరిగిందని నివేదికల డేటా ప్రకారం వెలుగు చూసింది. 2022లో యాసిడ్ దాడికి గురైన ఏడుగురు మహిళలతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఐదు యాసిడ్ దాడి కేసులతో అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ సీఆర్ బీ గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 7 యాసిడ్ దాడులకు ప్రయత్నించిన కేసులు నమోదయ్యాయి.

బెంగళూరులో గతేడాది ఇలాంటి 3 కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో 2022లో రెండు యాసిడ్ దాడులకు ప్రయత్నించిన కేసులు నమోదయ్యాయి. 24 ఏళ్ల ఎంకామ్ గ్రాడ్యుయేట్ యువతిపై యాసిడ్ దాడి కేసు బెంగళూరును కలచివేసింది. ఏప్రిల్ 28న విధులకు వెళ్లిన ఆమెపై యాసిడ్ దాడి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు కొన్నాళ్లుగా మహిళను వెంబడిస్తున్నాడని, ప్రేమకు నిరాకరించినందుకే తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకోవాలని మహిళను బలవంతం చేసి తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై యాసిడ్ పోశాడు. అనంతరం స్వామి వేషధారణలో తలదాచుకున్న నిందితుడిని తిరువణ్ణామలై ఆశ్రమం నుంచి మేలో అరెస్టు చేశారు.

యాసిడ్ దాడి బాధితురాలికి కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. ఇదే విధమైన మరొక కేసు జూన్ 10, 2022 న నమోదైంది, ఇందులో నిందితుడు తన వివాహం చేసుకోవడానికి నిరాకరించిన తర్వాత మహిళా స్నేహితురాలు ముఖంపై యాసిడ్ పోశాడు. మొత్తం మీద గత ఏడాది బెంగళూరులోనే మహిళలపై ఎక్కువగా యాసిడ్ దాడులు జరిగాయని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications