నెహ్రూపై సీడీఎస్ అనిల్ చౌహాన్ షాకింగ్-టిబెట్ ను చైనాకిచ్చి, పంచశీల..!
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అప్పట్లో టిబెట్ ను చైనాకు ఇచ్చేసి పంచశీల ఒప్పందం కుదుర్చకున్నా ఇప్పటికీ ఆ దేశంతో మనకు సరిహద్దు సమస్యలు కొనసాగుతుండటంపై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలుచేశారు.
భారత్-చైనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై సాయుధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం తర్వాత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (jawahar lal nehru) టిబెట్ (Tibet)ను చైనా(china)కు ఎందుకు ఇచ్చేశారో, అప్పట్లో కుదిరిన పంచశీల ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉన్నా సరిహద్దు వివాదాలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అన్న అంశాలపై సీడీఎస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
1954లో భారత్ టిబెట్ను చైనాలో భాగంగా గుర్తించిందని, ఇరు పొరుగు దేశాలూ పంచశీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ ఇవాళ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ ఒప్పందం ఏదో ఒక విధంగా ఉత్తర సరిహద్దు వివాదాన్ని లాంఛనప్రాయంగా పరిష్కరించినట్లు భారత్ ఆ రోజుల్లో భావించిందని, అయితే చైనా మాత్రం ఇది కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కుదిరిందని తేల్చేసిందన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యం కోసమే చేసుకున్నారు తప్ప, సరిహద్దుపై చైనా వైఖరిని ఏమాత్రం ప్రతిబింబించలేదన్నారు.

బ్రిటీష్ వారు వెళ్లిపోయాక, తమ సరిహద్దు ఎక్కడ ఉందో భారతదేశం నిర్ణయించుకోవాల్సిందని, తూర్పున మనకు మెక్మోహన్ లైన్ లాంటిది ఒకటి ఉందని నెహ్రూకు బహుశా తెలుసని, లడఖ్ ప్రాంతంలో కూడా మనకు ఏదో ఒక సమస్య ఉందని ఆయనకు తెలుసని, అందుకే బహుశా ఆయన పంచశీల ఒప్పందాన్ని కోరుకున్నారని సీడీఎస్ తెలిపారు. దాదాపు 890 కిలోమీటర్ల పొడవైన మెక్మోహన్ లైన్ తూర్పున బ్రిటిష్ ఇండియా, టిబెట్ల సరిహద్దుగా ఉండేదని, చైనా తన టిబెట్ విముక్తి తర్వాత ఆ ప్రాంతంలోకి ప్రవేశించడంతో పాటు స్థిరత్వాన్ని కోరుకుందన్నారు.

స్వతంత్ర భారతదేశం చైనాతో మంచి సంబంధాలను పెంచుకోవడానికి తీవ్రంగా ఆసక్తిగా ఉండేదని, 1949లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత, అది తన ప్రదేశాల కోసం ఎలాంటి వాదనలు చేయలేదని సీడీఎస్ తెలిపారు. బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా పొందిన ప్రత్యేక హక్కులను కూడా వదులుకుందన్నారు. కానీ టిబెట్ను ఆక్రమించుకున్నాక ఐరాసలో చైనాకు శాశ్వత సభ్యత్వం లభించడాన్ని భారత్ గుర్తించిన కారణంగా భారత్-టిబెట్ మధ్య ఉన్న 'హిమాలయ బఫర్' కనుమరుగైందని జనరల్ చౌహాన్ తెలిపారు. అప్పటి నుంచి ఇది సరిహద్దు వివాదంగా మారిందన్నారు. పంచశీల ఒప్పందానికి సరిహద్దుల అంశంపై తమ వైఖరితో ఎటువంటి సంబంధం లేదని చైనా మరోసారి తేల్చేసిందన్నారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications