జైల్లో శశికళ మౌనవ్రతం, మూడో ప్రపంచ యుద్దం వస్తుందా ? చాలా విడ్డూరంగా ఉంది!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు శశికళ నటరాజన్ హాజరుకారని, చిన్నమ్మ మౌనవ్రతం చేస్తున్నారని ఆమె న్యాయవాది మంగళవారం మీడియాకు చెప్పారు.
జనవరి పూర్తిగా !
చిన్నమ్మ శశికళ డిసెంబర్ 5వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మౌన వత్రం చేస్తున్నారని ఆమె న్యాయవాది చెన్నైలో మీడియాకు చెప్పారు. శశికళ జనవరి నెల చివరి వరకూ మౌనవ్రతం చేస్తారని న్యాయవాది అన్నారు.
కారణం అదే !
శశికళ మౌనవ్రతం చేస్తున్నందు వలనే రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరుకారని ఆమె న్యాయవాది వివరణ ఇచ్చారు. శశికళ మౌనవ్రతం చేస్తున్నారనే విషయం ఆమె న్యాయవాది మీడియాకు చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఎవరిని ఉద్దరించడానికి !
ఎవరిని ఉద్దరించడానికి శశికళ జైల్లో మౌనవ్రతం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఎద్దవే చేస్తున్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారనే భయంతోనే శశికళ మౌనవత్రం చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు.
శశికళకు మాత్రమే తెలుసు !
జయలలిత చికిత్స విషయంలో అసలు ఏం జరిగిందో ఒక్క శశికళకు మాత్రమే తెలుసని, ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో తాను మౌనవ్రతం చేస్తున్నానని చిన్నమ్మ డ్రామాలు ఆడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఏ పరిస్థితిలో ఆసుపత్రికి అమ్మ !
శశికళ ఒక్క రోజు మౌనవ్రతం పక్కన పెట్టి జయలలితకు ఎలాంటి చికిత్స అందించాం, అమ్మను ఏ పరిస్థితిలో ఆసుపత్రిలో చేర్పించాం అని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు చెప్పాలని అనేక మంది అమ్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మూడో ప్రపంచ యుద్దం !
శశికళ మౌనవ్రతం పక్కనపెడితే మూడు ప్రపంచ యుద్దం వస్తుందా ? అంటూ సైటర్లు వేస్తున్నారు. ఇంత కాలం ఆమె చేసింది చాలని ఆరోపిస్తున్నారు. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చెయ్యాలని జయలలిత అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.