వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సులా వెళ్లింది: పసికందును మాయం చేసింది

|
Google Oneindia TeluguNews

మధుర: ఓ మాయలేడి నర్సులా వెళ్లి పురిటి బిడ్డను ఎత్తుకుని అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును దొంగలించారు.

మధురలోని నవనీత్ నగర్ కు చెందిన నస్రీన్ జనవరి 29న మగబిడ్డను ప్రసవించింది. సోమవారం ఓ మహిళ నర్సులా అక్కడికి వెళ్లింది. పిల్లాడికి వాక్సిన్ వేయిస్తానని మాయమాటలు చెప్పి నస్రీన్ నుంచి పసికందును తీసుకుంది.

New born stolen from government hospital in Uttar Pradesh

పిల్లాడిని తీసుకు వెళ్లిన ఆమె ఎంతకు రాకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నస్రీన్ కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

జిల్లా మెజిస్ట్రేట్ రాజేష్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లాడు చోరీకి కారణమైన ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ మీద చర్యలు తీసుకోవాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు పిల్లాడిని ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.

English summary
The child was yesterday stolen by the woman who took the baby from his mother Nasrin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X