భారత్లో బాగా తగ్గిన కరోనా కొత్తకేసులు: 20వేల దిగువకు యాక్టివ్ కేసులు; తాజా కేసులెన్నంటే!!
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా మూడు వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు ఈ రోజు ఒక్క సారిగా మూడు వేల దిగువకు చేరుకున్నాయి. భారతదేశంలో ఈరోజు 2,288 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజుతో పోలిస్తే 28.6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. దాదాపు తొమ్మిది రోజుల తర్వాత మూడు వేల దిగువకు కరోనా కేసులు చేరుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,31,07,689కి చేరుకుంది.
కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో క్రియాశీల కేసులు కూడా 20 వేల దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 19,637కి తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించబడిన డేటా ప్రకారం తాజాగా 10 మరణాలతో కలిపి దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,24,103కి చేరుకుందని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
యాక్టివ్ కోవిడ్-19 కేసులలో 24 గంటల వ్యవధిలో 766 కేసులు తగ్గుదల నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ సానుకూలత రేటు 0.47 శాతంగా ఉంది, ఇక ఇదే సమయంలో వారపు సానుకూలత రేటు 0.82 శాతంగా నమోదైంది. 3,044 మంది గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 84.15 కోట్లు కాగా, గత 24 గంటల్లో 4,84,843 పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 190.50 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు అందించబడ్డాయి.
ముంబైలో సోమవారం 63 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటి 123 కంటే దాదాపు 50 శాతం తక్కువ, ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 10,60,792కి చేరుకుందని పౌర అధికారి తెలిపారు. మరణాల సంఖ్య 19,563 వద్ద ఉంది. అయితే రికవరీ సంఖ్య 56 పెరిగి 10,40,407కి చేరుకుంది. మహానగరంలో 822 క్రియాశీల కేసులు ఉన్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డేటా రికవరీ రేటు 98 శాతం మరియు కేసుల రెట్టింపు సమయం 6,347 రోజులుగా ఉంది.
ఇప్పటివరకు నిర్వహించిన కరోనావైరస్ పరీక్షల సంఖ్య 1,69,60,984 అని వెల్లడించింది. వీటిలో 5,810 గత 24 గంటల్లో జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 799 కొత్త కేసులు, 3 మరణాలు, 1,366 రికవరీలు నమోదయ్యాయి. సంచిత సానుకూలత రేటు 4.98% గా ఉంది.