Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ హబ్ లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్, కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్, పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్ !

కర్ణాటక రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రూపొందించిన పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన 8 మంది అనుమానిత ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. 8 నిందితుల్లో ఇప్పటికే ఆరు మందిని అరెస్టు చేశారు.

మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. పరారిలో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నారని, ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు వివరించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేరళకు చెందిన నాసీర్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ అహ్మద్, సల్మాన్ ఖాన్ విదేశాల్లో తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

NIA officials have submitted a charge sheet against the accused who planned suicide attacks in Bengaluru
వీరితో పాటు జూలై 19వ తేదీన బెంగళూరులో అరెస్టు అయిన సయ్యద్ సుహైల్ ఖాన్, మహ్మద్ ఉమర్, జహీద్ తబ్రేజ్, సయ్యద్ ముదాసిర్, ఫైసల్ రబ్బానీల పేర్లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. వారందరిపై ఐపీసీ సెక్షన్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. జూన్ 18వ తేదీన బెంగళూరులో పేలుడుకు కుట్ర జరుగుతోందన్న అనుమానంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి జూన్ 19వ తేదీన పోలీసులు దాడి చేసి ఐదుగురు లష్కర్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుల నుంచి 7 నాడా పిస్టల్స్, 45 లైవ్ బుల్లెట్లు, వాకీవాటి, డ్రాగర్లు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన కేసు కావడంతో 2023 అక్టోబర్‌లో ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ ఈ ఉగ్రవాదులను మరో కేసులో అరెస్టు చేశారు.

NIA officials have submitted a charge sheet against the accused who planned suicide attacks in Bengaluru
2017లో పరప్ప అగ్రహార జైలులో వీరంతా కలిసి ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ఎన్ఔఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. అనంతరం 7 మందిని జైలు నుంచి విడుదల చేశారు. జైలులో ఉన్న నాసీర్ మరో కేసులో దోషిగా తేలగా, మిగిలిన ఇద్దరు తప్పించుకున్నారు. గతేడాది జూన్ 18వ తేదీన మళ్లీ 5 మందిని అధికారులు అరెస్టు చేశారు.

యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడానికి వీరు ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉగ్రవాద సంస్థలకు అక్రమంగా డబ్బు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు శక్రవారం తొలి ఛార్జిషీట్‌ను సమర్పించింది. తదుపరి విచారణ కొనసాగిస్తోందని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+