9ఏళ్ల బాలికపై రేప్: తీవ్ర రక్తస్రావంతో మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ పట్టణం షకారిపుకుర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదేళ్ల బాలికపై పొరుగున ఉండే 27ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు వారి మరో కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఇంట్లో తొమ్మిదేళ్ల బాలిక ఒంటరిగా ఉంది. ఇది గమనించి పొరుగున ఉండే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి కుక్క మొరుగుతూ ఉండటంతో పరుగు పరుగున తమ కూతురు కోసం వెతకగా ఇంటి వెనుక స్థలంలో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
కుమార్తె మృతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications