కేరళలో నిఫా ప్రమాద ఘంటికలు: అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిక!
Recommended Video

కోజికోడ్: నిఫా కారణంగా కేరళలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో మరో ఇద్దరు నిఫా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ 'మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం' అంటూ ఆమె కామెంట్ చేశారు. నిఫాను అరికట్టేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిఫా అనుమానిత కేసులు, నిఫాతో బాధపడుతున్నవారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు టెస్టుల రిపోర్టులు బయటపెడుతామన్నారు.
కోజికోడ్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. వైద్య సిబ్బంది సైతం జాగ్రత్తలు తీసుకోవాలసి సూచిస్తున్నారు. నిఫాతో ఇద్దరు పేషెంట్స్ చనిపోయిన ఆసుపత్రిలో.. నలుగురు డాక్టర్లు, నర్సులను వారం రోజులు లీవుపై పంపించారు.

కాగా, గురువారం నిఫాతో మృత్యువాతపడ్డ రేసిన్ మొదట బ్లాసరీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. మొదట అతనికి నిఫా నెగటివ్ అని తేలినప్పటికీ.. ఆ తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆసుపత్రిలోనే అతను చనిపయాడు. అయితే అంతకుముందు ఆసుపత్రిలో చేరిన మరో పేషెంట్ నుంచే అతనికి ఆ వ్యాధి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కోజికోడ్ జిల్లా కోర్టు సూపరిండెంట్ కూడా నిఫా కారణంగా మృతి చెందడంతో కొద్దిరోజుల పాటు కోర్టు వ్యవహారాలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా బార్ అసోసియేషన్ కు ఆదేశాలు వెలువడ్డాయి. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ.. జూన్ 5నుంచి మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అన్ని రాత పరీక్షలు, ఆన్ లైన్ పరీక్షలను జూన్ 16వ తేదీ దాకా వాయిదా వేసింది. ఇప్పటిదాకా మొత్తం 203 నిఫా అనుమానిత కేసులకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. అందులో 18పాజిటివ్ గా తేలాయి. ఆ 18మందిలో 16మంది ఇప్పటికే చనిపోయారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications