'పాట్నా బాంబు పేలుళ్లు: విందులో నితీష్ ఎంజాయ్
పాట్నా పేలుళ్ల ఘటనపై నితీశ్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, పేలుళ్ల బాధితులను పరామర్శించకుండా విందు, వినోద కార్యక్రమాల్లో మునిగితేలారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు మృతి చెందినప్పుడు ఇక్కడి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాత్రం పార్టీలకతీతంగా స్పందించారన్నారు.
తన యాత్రను రద్దు చేసుకుని మరీ బాధిత కుటుంబాలను పరామర్శించారన్నారు. బిజెపి ప్రభుత్వానికి, నితీశ్ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేనని ఎద్దేవా చేశారు. పేదరికంపై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మోడీ తప్పు పట్టారు. రాహుల్కు పేదరికం బాధ తెలియదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చిందని రాహుల్ గొప్పలకు పోతోందని కానీ, రాష్ట్రంలో రమణ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోందని గుర్తు చేశారు.
కాగా, పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సినిమా ఆడియో వేడుకలో పాల్గొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ పేలుళ్ల సమయంలో నితీష్ ఎంజాయ్ చేశారని ఆరోపణలు చేయడం గమనార్హం.