వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పాట్నా బాంబు పేలుళ్లు: విందులో నితీష్ ఎంజాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nitish Kumar
రాంచీ: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్య నేత నితీష్ కుమార్ పైన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో మోడీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాట్నా పేలుళ్ల ఘటనపై నితీశ్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, పేలుళ్ల బాధితులను పరామర్శించకుండా విందు, వినోద కార్యక్రమాల్లో మునిగితేలారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు మృతి చెందినప్పుడు ఇక్కడి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాత్రం పార్టీలకతీతంగా స్పందించారన్నారు.

తన యాత్రను రద్దు చేసుకుని మరీ బాధిత కుటుంబాలను పరామర్శించారన్నారు. బిజెపి ప్రభుత్వానికి, నితీశ్ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేనని ఎద్దేవా చేశారు. పేదరికంపై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మోడీ తప్పు పట్టారు. రాహుల్‌కు పేదరికం బాధ తెలియదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చిందని రాహుల్ గొప్పలకు పోతోందని కానీ, రాష్ట్రంలో రమణ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోందని గుర్తు చేశారు.

కాగా, పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సినిమా ఆడియో వేడుకలో పాల్గొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ పేలుళ్ల సమయంలో నితీష్ ఎంజాయ్ చేశారని ఆరోపణలు చేయడం గమనార్హం.

English summary
Gujarat CM Narendra Modi on Thursday alleged that Bihar CM Nitish Kumar was enjoying a mehfil when bombs were exploiding in Patna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X