ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు లేవు : బెయిల్ ఇవ్వాలని చిదంబరం వాదనలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు సందర్భంగా తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో తన పేరు కూడా లేదని స్పష్టంచేశారు చిదంబరం. కానీ కావాలని తనను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఎఫ్ఐఆర్లో ఎక్కడ తన పేరు లేదన్నారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన పాత్రపై ఏ దర్యాప్తు సంస్థ ఆధారాలు కూడా లేవన్నారు. ఈ కేసు 2007లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి పదేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు చిందబరం.

ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని .. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. చిదంబరం తర్వాత అతని లాయర్ కపిల్ సిబాల్ కూడా ఇదే అంశాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చిదంబరం చట్టానికి లోబడిన పౌరుడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications