ప్రీతిజింతా వేధింపుల కేసు: సీసీటీవీల్లో దొరకని ఆధారం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతాకు ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా వేధింపుల కేసులో.. పోలీసులకు వాంఖేడే స్టేడియంలోని సీసీటీవీ కెమెరాల నుండి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. వాంఖేడే స్టేడియంలోని గార్వేర్ పెవిలియన్ వద్ద ఐదు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
ఈ సీసీటీవీ కెమెరాల్లో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. ప్రీతిజింతా, నెస్ వాడియాల మధ్య వాదనలు జరిగినట్లుగా ఆధారాలు కనిపించలేదు.

వాంఖేడే స్టేడియంలో 172 రొటేటింగ్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఐదు సీసీటీవీ కెమెరాలు గార్వేర్ పెవిలియన్ వద్ద ఉన్నాయి. అయితే, ఈ సీసీటీవీ ఫుటేజిలలో మాత్రం వాగ్వాదం, వేధింపులకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. అయితే అవి రొటేటింగ్ కెమెరాలు కావడం గమనార్హం.
కాగా, మే 30వ తేదీన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని ప్రీతిజింతాఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె జూన్ 12వ తేదీన ఫిర్యాదు చేసింది. పలువురు సాక్ష్యులను కూడా పేర్కొంది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications