అత్యాచార నిందితులకు క్షమాబిక్ష ఎందుకు...? రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
దిశ హత్యానంతరం మహిళలు, చిన్నిపిల్లల హత్యాచారాలపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో మరణశిక్ష పడ్డ నిందితులకు క్షమాబిక్ష కోరేహక్కు లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్లపై పార్లమెంట్ పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. రాజస్థాన్లోని మౌంట్ అబులో బ్రహ్మకుమారీస్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోనన రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడిన నిందితులకు క్షమాబిక్ష కోరే అర్హత లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. మహిళల భద్రత దేశానికి చాల ముఖ్యమైన అంశమని, ఈ నేపథ్యంలోనే వారిని క్షమించే అవకాశం ఇవ్వకూడదని కోరారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ వ్యవస్థ పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Recommended Video
ఈ నేపథ్యంలోనే మహిళ భద్రత గురించి అనేక చట్టాలు తీసుకువచ్చామని, ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నేపపథ్యంలోనే పిల్లల్లో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే సమాజంలో సమానత్వం ,సామరస్యత అనేది మహిళల సాధికారితతోనే సాధ్యమని అయన అన్నారు.












Click it and Unblock the Notifications