ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో మంత్రులతోపాటు రాజకీయ నేతల ఫొటోలు ఉపయోగించొద్దని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తెలిపింది.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహాత్మా గాంధీ లాంటి దివంగత జాతీయ నేతల ఫొటోలను ఉపయోగించవచ్చని జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో తెలిపింది.

మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించరాదని పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రచారాన్ని ప్రోత్సహించే సంప్రదాయానికి దారితీస్తుందని తెలిపింది.
హోర్డింగులు, ప్రకటనల వల్ల ప్రజా ధనం వృథా అవుతుందని దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన అనంతరం కోర్టు ఈ మేరకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో జరిగితే, వాటిని దుర్వినియోగంగా పరిగణించడం జరుగుతుందని పేర్కొంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications