వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ పోల్ షెడ్యూల్ కుదింపుపై తకరారు -ఒకే రోజు పోలింగ్ పెట్టాలన్న మమత -మార్పుల్లేవన్న ఈసీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ కొత్త కేసులు, మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కుదిస్తారని, మిగిలిన ఫేజ్ లను ఏకం చేసి ఒకే రోజు పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బెంగాల్ లో పోల్ షెడ్యూల్ కుదింపు ఆలోచనగానీ, అలాంటి ప్రతిపాదనగానీ తమకు లేవని ఈసీ గురువారం క్లారిటీ ఇచ్చింది. కానీ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం షెడ్యూల్ కుదించాల్సిందేనని కోరారు.

తిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటేతిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటే

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశానికి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని సూచించారు.

 No plan to merge final 4 phases of Bengal polls, says EC but Mamata demands for Wrap Up


పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా, శనివారం (17న) ఐదో దశ పోలింగ్ జరుగనుంది. ఆ తర్వాత మరో మూడు దశల పోలింగ్ ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, మిగిలిన విడదతల పోలింగ్‌ను ఏకం చేసి ఒకేసారి నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు రాగా, అలాంటిదేమీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది. కానీ..

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదేశభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

పోల్ షెడ్యూల్ లో మార్పులు ఉండవని ఈసీ క్లారిటీ ఇచ్చినప్పటికీ, కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నాలుగు దశల ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎం మమత బెనర్జీ అభ్యర్థించారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఘోరంగా ఉందని, అందుకే ఒకే దశలో నిర్వహించాలని దీదీ అభ్యర్థించారు. ''ఎన్నికలను 8 దశల్లో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని ఈ పరిస్థితుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకే మిగిలిన ఎన్నికల దశలను ఒకే దశలో నిర్వహించండి. ఇలా చేయడం ద్వారా ప్రజలను కరోనా బారి నుంచి కాపాడిన వారమవుతాం'' అని మమత ట్వీట్ చేశారు.

English summary
Election Commission of India (ECI) officials on Thursday dismissed speculations that the final four phases of the ongoing assembly elections in the state of West Bengal could be clubbed due to an exponential rise in daily cases of the coronavirus disease (Covid-19) across the country. but Bengal Chief Minister Mamata Banerjee has called for clubbing the remaining four phases of elections into one day in view of the increasing Covid cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X