పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..
న్యూఢిల్లీ: పూరీలోని జగన్నాథ స్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్ సమీక్షించింది. పూరీ జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.
అయితే, కేవలం పూరీలో మాత్రమే రథయాత్ర నిర్వహణకు అనుమతిస్తున్నామన్న ధర్మాసనం.. ఒడిశాలోని మరే ప్రాంతంలోనూ నిర్వహించరాదని స్పష్టం చేసింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున భక్తులు లేకుండానే కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్రను నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండి, కరోనా వ్యాప్తి కట్టడిపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. కాగా, ఈ అంశంపై విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది. రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరపు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీం ధర్మాసనంకు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు.
కరోనా కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జూన్ 18న ఇచ్చిన ఆదేశాలను పునర్ సమీక్షించాలని కోరుతూ కేంద్రం, ఒడిశా ప్రభుత్వం సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. జస్టిస్ బోబ్డే ప్రత్యేక ధర్మాసనం నాగ్ పూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,046 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,75,349 యాక్టివ్ కేసులున్నాయి. 2,37,929 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 13,717 మంది మరణించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications