వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాండ్యలో రమ్యపై పోటీ: నటి రక్షితకు జెడి(ఎస్) షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

No ticket for Rakshita from Mandya says HDK
బెంగళూరు: ప్రముఖ నటి రక్షితకు జెడి(ఎస్) షాక్ ఇచ్చింది. జెడి(ఎస్) అధ్యక్షులు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మాండ్య నియోజకవర్గం పార్లమెంటు టిక్కెట్‌ను రక్షితకు ఇవ్వడం లేదని చెప్పారు.

బీజాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రక్షిత మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపించారని తెలిపారు. కానీ ఆమెకు పార్టీ టిక్కెట్ ఇవ్వడం లేదని, స్థానికులకే టిక్కెట్ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో జెడి(ఎస్) పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రక్షిత గతంలో వెల్లడించారు. జెడి(ఎస్) నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరే ప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అని రక్షిత వెల్లడించడం గమనార్హం.

అయితే, ఇప్పుడు జెడి(ఎస్) ఆమెకు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశ్యంతో లేనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున కన్నడ నటి రమ్య ఎంపీగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోను ఆమెనే పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మాండ్య నుండి మరో నటిని దింపాలని జెడి(ఎస్) తొలుత భావించింది. ఇందుకు రక్షిత కూడా ఆసక్తి చూపించారు. ఇప్పుడు స్థానికులకు అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Party will not issued ticket for Rakshita from Mandya for upcoming lok sabha election 2014 said former CM HD Kumaraswamy. In Bijapur he addressed media and said, Rakshita has expressed her interest in contesting from Mandya. But party will give ticket for local party activists he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X