'ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలి'
న్యూఢిల్లీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలను కనడంపై పరిమితులు విధించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయంచుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
దేశంలో జనాభా నియంత్రణకు అదే ఉత్తమమైన మార్గమమని, దీనిపై చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు, క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోరని తాను అనడం లేదని అందరికీ వర్తించేలా చట్టాన్ని తీసుకువస్తే బాగుంటుదన్నదే తన అభిప్రాయమని తెలిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలంతా ఈ శస్త్రచికిత్సలు చేసుంచుకుని ఉంటే భారత జనాబా ఇప్పుడు 30 కోట్లే ఉండేదని, చేయించుకోకపోడవం వల్లే 130 కోట్లకు చేరిందని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. గతంలో కూడా హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కూడా దేశంలోని ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
అంతేగాక, అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), ఆ పార్టీ నేతలు ఒవైసీ సోదరులు ‘విషపు పాములు' అని, మైనారిటీ మతస్థులను దోచుకునేందుకు విషం చిమ్ముతుంటారని కూడా సామ్నా సంపాదకీయం విమర్శించింది.
ముస్లింలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సంపాదకీయం పేర్కొంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేదని, ఇప్పుడు ఇతరులు కూడా తమను తాము లౌకికవాదులుగా చెప్పుకుంటున్నారని విమర్శించిన విషయం తెలిసిందే.