Udhayanidhi Stalin: మీ అబ్బ సొమ్మేం అడగట్లేదు.. కేంద్రంపై జూనియర్ స్టాలిన్ ఫైర్
Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంపై కేంద్ర సర్కారు విద్యా నిధులను నిలిపివేసి రాష్ట్రంపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమిళనాడు ద్విభాషా విధానం కోసం పోరాటంలో పాల్గొనాలని ఆయన పలు పార్టీలను కూడా కోరారు. సమగ్ర శిక్షా అభియాన్ నిధిలో తమిళనాడు తన వాటాను న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తోందన్నారు. తమిళనాడుకు న్యాయబద్ధంగా విడుదల చేయాల్సిన రూ.2,190 కోట్ల కోసం రాష్ట్రం యాచించడం లేదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. "మేము మీ అబ్బ సొమ్మేం అడగడం లేదు. తమిళనాడు విద్యార్థుల తల్లిదండ్రులు పన్ను రూపంలో చెల్లించిన మా హక్కును మేం అడుగుతున్నాం. మాకు చెందిన నిధిని మేము అడుగుతున్నాం." అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రజలు బీజేపీ బెదిరింపులకు భయపడరని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో విద్య, రెండు భాషల విధానం ముప్పులో ఉన్నాయన్నారు. "మనం హిందీని అంగీకరించాలని వారు దృఢంగా ఉన్నారు. వారు తమిళనాడు చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును నాశనం చేయాలనుకుంటున్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం తమిళనులను రెండో తరగతి పౌరులుగా మార్చాలని కోరుకుంటోంది" అని ఉదయనిధి పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీ అయిన ఏఐఏడీఎంకేను కూడా తమతో చేతులు కలిపి రాష్ట్ర ద్విభాషా విధానం కోసం పోరాడాలని కోరారు. రాజకీయ లాభం కోసం దీనిని ఉపయోగించకుండా తమతో చేరి గొంతును పెంచాలని ఏఐఏడీఎంకేను కోరుతున్నామన్నారు.

కొత్త విద్యా విధానం, త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి చెన్నైలో డీఎంకే నిరసన చేపట్టింది. ఈ నిరసనలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ నిరసనలో పాల్గన్నారు. తమిళనాడు ప్రజలు త్రిభాషా భాషా విధానాన్ని ఎప్పటికీ అంగీకరించరని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మాట్లాడుతూ.. తమిళనాడు త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే నిధులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయకపోతే రాష్ట్రానికి నిధులను విడుదల చేయదని అన్నారు.
-
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications