Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హర్యానాలో జునైద్ హత్య: స్పందించిన సబా దివాన్, హోరెత్తిన నిరసన

జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: ఒక భావనగా మొదలై.. క్రమంగా ఎదుగుతుందని ఆశ.. ఆ పై నిశ్శబ్ధ ఆలోచనగా మారుతుంది.. తదుపరి నిశ్శబ్ధ పదంగా.. ఆ పిదప పెద్ద గొంతుకగా పెగిలి రణన్నినాదమవుతుంది' అని ప్రముఖ సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇది గతవారం ఢిల్లీ నుంచి హర్యానా వెళుతున్న ముస్లిం యువకుడిపై దాడి, హత్య చేయడం ఆమెను కదిలించింది.. అటు పిమ్మట దేశం నలుమూలల నగరాలు, పట్టణాలు.. విదేశాల్లోని ప్రజలనూ కదిలించింది. ఘటన జరిగిన తర్వాత ఆరు రోజులకు బుధవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దారితీసింది.

రంజాన్ పండుగకు ముందుకు ఈ నెల 22న అవసరమైన షాపింగ్ చేసుకుని రైలులో హర్యానా రాష్ట్రం బల్లాభ్ గఢ్ జిల్లా పరిధిలోని సొంత ఊరికి వెళుతున్న జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ హత్య జరిగిన మరుసటి రోజే ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పిలుపునిచ్చారు.

11 నగరాల్లో నిరసన వెల్లువ

11 నగరాల్లో నిరసన వెల్లువ

‘నాట్ ఇన్ మై నేమ్' అనే పేరుతో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. ‘జునైద్ హత్యకు నిరసనగా ఎందుకు ప్రదర్శనలు జరుగడం లేదు. రాజకీయ సంస్థలు, పార్టీలు పూనుకునే వరకు ఎందుకు వేచి ఉండాలి. నాట్ ఇన్ మై నేమ్' అనే బ్యానర్ కింద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశ పౌరులుగా మనమంతా ఈ దాడులను ఎందుకు తిప్పికొట్టగూడదు? ' అని ప్రశ్నిస్తూ ఆమె పోస్టు చేశారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ప్రదర్శన వివరాలను వెల్లడించారు. ఆ పోస్ట్ స్ఫూర్తిగా బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తోపాటు దేశంలోని 11 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, టొరంటో, బోస్టన్, కరాచీ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయని దివాన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. తన పిలుపునకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని తానూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.

జంతర్ మంతర్ వద్ద ఇలా నిరసన

జంతర్ మంతర్ వద్ద ఇలా నిరసన

జునైద్‌పై దాడిని నిరసిస్తూ ఢిల్లీ వాసులు ప్రదర్శన నిర్వహించారు. నాట్ ఇన్ మై నేమ్, నాట్ ఇన్ ఎనీవన్ నేమ్, ముస్లింల జీవన సమస్య.. అందరి జీవన సమస్య అనే శీర్షికలతో కూడిన పోస్టర్లు, ప్లకార్డులు జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రదర్శనలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పాల్గొన్నారు. భారతదేశంలో ‘భయకంపిత వాతావరణం' నెలకొన్నదని పేర్కొంటూ ఆందోళనకారులు కవితలు చదువుతూ, పాటు పాడుతూ, పోస్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు.

సర్కార్ మౌన ముద్ర వహిస్తుందని విమర్శలు

సర్కార్ మౌన ముద్ర వహిస్తుందని విమర్శలు

‘నాట్ ఇన్ మై నేమ్, నాట్ ఇన్ ఎనీవన్స్ టైమ్', ‘ముస్లింల జీవన సమస్య, అందరి జీవన సమస్య' అని నినదించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా, జేడీయూ నేత కేసీ త్యాగి, సీపీఐ కార్యదర్శి డీ రాజా, ప్రముఖ నేపథ్య గాయని రబ్బి షెర్గిల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ‘వ్యవస్థీక్రుత హింసకు వ్యతిరేకంగా మేం నిరసన జరిపాం. ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వం మౌనముద్ర వహించడం తప్పా ఏమీ చేయలేదు‘ అని సబా దివాన్ పేర్కొన్నారు.

రామచంద్ర గూహ ఆధ్వర్యంలో నిరసన

రామచంద్ర గూహ ఆధ్వర్యంలో నిరసన

ముంబైలో షబానా అజ్మీ, బెంగళూరులో చరిత్ర పరిశోధకుడు రామచంద్ర గుహా, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ తదితరులు, కోల్ కతాలో ప్రముఖ సినీ నిర్మాత అపర్ణా సేన్ నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. జునైద్‌పై దాడి ఘటనలో ఢిల్లీకి చెందిన ప్రభుత్వోద్యోగి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఫరీదాబాద్ ఎస్పీ కమల్‌దీప్ గోయల్ తెలిపారు. కాగా, ఈ ఘటనను హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్రంగా ఖండించారు.

కవితలు, గేయాలతో నిరసనలు

కవితలు, గేయాలతో నిరసనలు

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూకుమ్మడి దాడులు పదేపదే పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన నిలబడితే వారిని రక్షించడం కోసం మౌనముద్ర వహించడానికి బదులు కుట్రదారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే తరహా నిరసన ప్రదర్శనలు ముంబై, హైదరాబాద్, తిరువనంతపురం, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగాయి. ప్రముఖ సినీ నటులు కల్కి కౌచిలిన్, కొంకణ్ సేన్ శర్మ తదితరులు ముంబై ప్రదర్శనలో పాల్గొన్నారు.

జాతిపిత పేరిట ఇలా నిరసనలు

జాతిపిత పేరిట ఇలా నిరసనలు

ఒకవైపు ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నా నిరసన కారులు ప్రదర్శనలో పాల్గొనడం గమనార్హం. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రదర్శనలో పాల్గొన్న విష్ణు అనే విద్యార్థి మాట్లాడుతూ మూకుమ్మడి దాడులు ఎక్కడ జరిగినా తాను వ్యతిరేకినని, ఇటువంటి ఘటనలు భారతదేశ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు బూటకపు జాతీయవాదంతో మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ రాసిన కవితలను రాసి నిరసన తెలిపారు. సామాన్యుల్లో ఒకరి పట్ల మరొకరికి వ్యతిరేకత లేదని, కొందరు వ్యక్తులు లేని ఉద్రిక్తతలు కల్పిస్తున్నారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+